breaking news
poleramma
-
వైభవంగా పోలేరమ్మ నగరోత్సవం.. కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)
-
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వడియంపేటకు చెందిన పామిశెట్టి పోలేరమ్మ (70) అంగడికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద బొలెరో వాహనాన్ని రివర్స్ తీసుకుంటూ పోలేరమ్మను ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలపాలైన పోలేరమ్మను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో తులసి పూజలు
కడప కల్చరల్: కడప నగరం చిన్నబెస్తవీధిలోని శ్రీ బాల పోలేరమ్మ ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా అమ్మవారికి తులసి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి 500 తులసి మొక్కలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి సహస్ర నామార్చన చేశారు. అర్చకులు భక్తులకు మంగళహారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.


