స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్‌ | notification issue for mlc elections tomorrow | Sakshi
Sakshi News home page

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్‌

Feb 19 2017 10:36 PM | Updated on Aug 14 2018 4:32 PM

శాసనమండలి లోకల్‌ అథారిటీ నియోజకవర్గం ఎన్నికలకు మంగళవారం జాయింట్‌ కలెక్టర్, రిటర్నింగ్‌ అధికారి సి.హరికిరణ్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

– అదే రోజు నుంచి నామినేషన్‌లు
కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి లోకల్‌ అథారిటీ నియోజకవర్గం ఎన్నికలకు మంగళవారం జాయింట్‌ కలెక్టర్, రిటర్నింగ్‌ అధికారి సి.హరికిరణ్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్‌ల దాఖలుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్‌లు వేయవచ్చు. మార్చి1న నామినేషన్‌లను పరిశీలిస్తారు. మార్చి 3వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జాయింట్‌ కలెక్టర్‌ చాంబరులోనే నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. నామినేషన్లు  సమర్పించేవారు విధిగా ఆస్తులు, కేసులపై అపడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఫారం– 26 ద్వారా అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు.. నామినేషన్ల దాఖలుకు రూ.5వేలు, ఇతరులు రూ.10వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంది. ఒక అభ్యర్థి డిపాజిట్‌పై నాలుగు సెట్‌ల నామినేషన్‌లు ఇవ్వవచ్చునని అసిస్టెంటు రిటర్నింగ్‌ అధికారి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. అయితే లోకల్‌ అథారిటీ నియోజకవర్గంలో   ఓటర్లుగా ఉన్న పది మంది ప్రతిపాదించాల్సి ఉంది. నామినేషన్ల దాఖలుకు రిటర్నింగ్‌ అధికారి చాంబరులోకి అభ్యర్థితో సహా అయిదుగురిని మాత్రమే అనుమతిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement