పల్లెల్లో చీకట్లు | No power in Villages | Sakshi
Sakshi News home page

పల్లెల్లో చీకట్లు

Sep 26 2016 11:50 PM | Updated on Sep 4 2017 3:05 PM

అంధకారంలో చంద్రగిరి పంచాయతీ

అంధకారంలో చంద్రగిరి పంచాయతీ

అధిక మొత్తంలో పాత బకాయిలున్న మేజర్‌ పంచాయతీలపై ఏపీఎస్పీడీసీయల్‌ పవర్‌ కట్‌ ఆయుధాన్ని ప్రయోగించింది. పీలేరు, చంద్రగిరి, సీటీయం, నారాయణవనం, ఐరాల, యాదమర్రి, గుడిపల్లి, కలకడ మేజర్‌ పంచాయతీల్లో మొదటి విడతగా వీధి దీపాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

– పంచాయతీలకు పవర్‌ కట్‌
– పాత బకాయిలు చెల్లించలేదని 
 సరఫరా నిలిపివేత
–పట్టణాలకు రెండ్రోజుల్లో ఇదే షాకు
 – పట్టించుకోని ప్రభుత్వం
 
 ఓ వైపు గ్రామాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటనలు గుప్పిస్తున్న టీడీపీ సర్కారు మరోవైపు పల్లెలను అంధకారంలోకి నెడుతోంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీల నెత్తిన విద్యుత్‌ బిల్లుల భారం మోపుతుంది. తక్షణమే పాత బకాయిలు చెల్లించలేదని కొన్ని పల్లెల్లో ఇప్పటికే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. పది మేజర్‌ పంచాయతీల్లో ఇప్పుడు చీకటి రాజ్యమేలుతోంది.
తిరుపతి రూరల్‌:
అధిక మొత్తంలో పాత బకాయిలున్న మేజర్‌ పంచాయతీలపై ఏపీఎస్పీడీసీయల్‌ పవర్‌ కట్‌ ఆయుధాన్ని ప్రయోగించింది. పీలేరు, చంద్రగిరి, సీటీయం, నారాయణవనం, ఐరాల, యాదమర్రి, గుడిపల్లి, కలకడ మేజర్‌ పంచాయతీల్లో మొదటి విడతగా  వీధి దీపాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. పంచాయితీలు స్పందించకపోతే త్వరలో నీటి  సరఫరా కనెక్షన్లను కూడ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్‌ పునరుద్ధరించేది లేదని విద్యుత్‌ శాఖాధికారులు తేల్చిచెపుతున్నారు. మున్సిపాలిటీల్లో రూ. 4.42 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మున్సిపాలిటీల్లోని వీధి దీపాలకు కూడ మరో రెండు రోజుల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్నట్లు డిస్కం అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
పంచాయితీలకు 14వ ఆర్థిక సంఘ నిధులు ఎక్కడా.?
పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. జిల్లాలోని 1364 పంచాయతీలకు రూ.56 కోట్లను మంజూరు చేసినట్లు గత మూడు నెలలుగా అధికారులు ప్రకటిస్తున్నా, ఇంత వరకు నిధులు చేరలేదు. ఇప్పటి వరకూ పంచాయతీలు బిల్లులు చెల్లించలేకపోయాయి. ఇవేవి పట్టించుకోని విద్యుత్‌ శాఖాధికారులు పల్లెల్లో అం«ధకారం నింపుతున్నా జిల్లా కలెక్టర్, డీపీవోలు పట్టించుకోవడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా 14వ ఆర్థిక సంఘ నిధులను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. 
 
పవర్‌ కట్‌ నిజమే..
జిల్లాలో కొన్ని పంచాయతీలకు పవర్‌ కట్‌ చేసింది వాస్తవమే. పాత బకాయిలు చెల్లించలేదని వీధిలైట్ల కనెక్షన్లు తొలగించారు. 14వ ఆర్థిక సంఘ నిధులు రెండు, మూడు రోజుల్లో పంచాయతీలకు కేటాయిస్తాం. 
– ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి.
క్రమ  సంఖ్య విద్యుత్‌ డివిజన్‌ బకాయిలు  ( రూ. కోట్లలో)
 1 తిరుపతి టౌన్‌ 16
 2 తిరుపతి రూరల్‌ 21.71
 3 పుత్తూరు 29.24
 4 మదనపల్లి 25.25
 5 పీలేరు 39.54
 6 చిత్తూరు రూరల్‌ 26.55
 7 చిత్తూరు టౌన్‌ 11.89
                 మొత్తం 169.20
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement