కేటీకే 2వ గనిని సందర్శించిన మల్టీ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ | Multi-Departmental Committee visited the 2nd block ketike | Sakshi
Sakshi News home page

కేటీకే 2వ గనిని సందర్శించిన మల్టీ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ

Sep 23 2016 2:41 AM | Updated on Sep 4 2017 2:32 PM

కేటీకే 2వ గనిని సందర్శించిన మల్టీ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ

కేటీకే 2వ గనిని సందర్శించిన మల్టీ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2వ గనిని గురువారం మల్టీ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ సందర్శించింది. కమిటీ కన్వీనర్, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, కమిటీ సభ్యులను గని అధికారులు, కార్మికులు సాదరంగా ఆహ్వానం పలికారు. గని ఆవరణలో జరిగిన కార్యక్రమానికి గని మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు అధ్యక్షత వహించారు.

కోల్‌బెల్ట్‌ : భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2వ గనిని గురువారం మల్టీ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ సందర్శించింది. కమిటీ కన్వీనర్, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, కమిటీ సభ్యులను గని అధికారులు, కార్మికులు సాదరంగా ఆహ్వానం పలికారు. గని ఆవరణలో జరిగిన కార్యక్రమానికి గని మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. కమిటీ సభ్యులు సయ్యద్‌ హబీబీŠ హుస్సేన్‌, కిశోర్‌గంగా, ఎం.అప్పారావు, కేవీ కిషన్‌రావు, రేవు సీతారాం, బి.రవీందర్, యూటీ.రావు రక్షణతో కూడిన ఉత్పత్తి –ఉత్పాదకత, యంత్రాల వినియోగం, నాణ్య త, రక్షణ, ఉత్పత్తి ఖర్చు, లాభనష్టాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంస్థ లక్ష్య సాధన తదితర అం శాలపై స్లైడ్‌ల ద్వారా కార్మికులకు అవగాహన కల్పించారు. కాగా, సింగరేణి సంస్థ నిరే్ధశించిన లక్ష్యా న్ని అధిగమించటం ద్వారా సంస్థ మనుగడ సాధిస్తుందని, బొగ్గు మార్కెట్‌లో నెలకొన్న పోటీతత్వాన్ని అధిగమించేందుకు నాణ్యత కలిగిన బొగ్గు సరఫరా చేయాల్సి ఉందని కన్వీనర్‌ పాలకుర్తి సత్తయ్య అన్నారు. సింగరేణిలోని 26 భూగర్భగనుల్లో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2వ గని మాత్రమే లాభాల్లో పయనిస్తుందని, అదే స్ఫూర్తి కొనసాగించాలని కార్మికులను ఆయన కోరారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవటంతోపాటు అన్ని విధాలా పొ దుపు చర్యలు చేపట్టాలని సూచించారు. సంస్థలను కాపాడుకోవాలంటే రానున్న రోజుల్లో లక్ష్యాన్ని అధిగమించటం ఒక్కటే మార్గమని అన్నారు. గని వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ మదార్‌ సాహెబ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement