తల్లీకొడుకు అదృశ్యం | mother and son missing | Sakshi
Sakshi News home page

తల్లీకొడుకు అదృశ్యం

Mar 23 2017 12:21 AM | Updated on Sep 5 2017 6:48 AM

మండలంలోని కోగిర గ్రామానికి చెందిన జ్యోతి(26), ప్రణిత్‌(5) అనే తల్లీకొడుకులు బుధవారం అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని ఎస్‌ఐ మున్నీర్‌ అహమ్మద్‌ తెలిపారు.

రొద్దం (పెనుకొండ) : మండలంలోని కోగిర గ్రామానికి చెందిన జ్యోతి(26), ప్రణిత్‌(5) అనే తల్లీకొడుకులు బుధవారం అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని ఎస్‌ఐ మున్నీర్‌ అహమ్మద్‌ తెలిపారు. మంగళవారం ఉదయం జ్యోతి తన కొడుకుతో పెనుకొండకు వెళ్తున్నట్లు పక్కింటి వారికి చెప్పి బయలుదేరిందన్నారు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ధర్మవరంలో ఉంటున్న జ్యోతి అన్న శశికుమార్‌కు ఫోన్‌లో సమాచారం తెలిపినట్లు వివరించారు. ఆయన వెంటనే తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. తల్లీబిడ్డల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement