రోళ్లపాడు అభయారణ్యంలోంచి నీటికోసం దారితప్పిన దుప్పి జూపాడుబంగ్లాకు చేరుకొంది.
జనారణ్యంలోకి దుప్పి
May 7 2017 12:19 AM | Updated on Sep 5 2017 10:34 AM
జూపాడుబంగ్లా: రోళ్లపాడు అభయారణ్యంలోంచి నీటికోసం దారితప్పిన దుప్పి జూపాడుబంగ్లాకు చేరుకొంది. తెల్లవారిన తర్వాత జనారణ్యంలో ఎటువెళ్లాలో దిక్కుతోచక గ్రామంలోని నాగేశ్వరమ్మ ఇంట్లోకి చొరబడింది. ఆమె భయంతో కంగారుపడిపోయి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. స్థానిక పోలీసులు Ððవెంటనే దుప్పిని పోలీసుస్టేషన్కు తరలించారు. కాలికి తీవ్ర రక్తగాయాలు కావటంతో దుప్పి అస్వస్థతకు గురైంది. విషయాన్ని ఎస్ఐ అశోక్.. ఆత్మకూరు అటవిశాఖ డీఆర్వో రంగన్నకు తెలియజేయటంతో ఆయన తన సిబ్బందితో జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. గాయపడిన దుప్పికి చికిత్సలు నిర్వహించి వెంటతెచ్చిన బోనులో ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దుప్పి కోలుకున్న తర్వాత అటవిలో వదిలి పెడతామని డీఆర్వో రంగన్న తెలిపారు.
Advertisement


