రేపు మంత్రి రావెల రాక | minister ravela kishor babu came tomorrow | Sakshi
Sakshi News home page

రేపు మంత్రి రావెల రాక

Oct 22 2016 11:54 PM | Updated on Sep 4 2017 6:00 PM

జిల్లాలో చేపట్టిన ‘చంద్రన్న దళిత బాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖ మంత్రి రావెల కిషోర్‌ బాబు, ఎస్‌సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు సోమవారం జిల్లాకు విచ్చేస్తున్నారు.

అనంతపురం అర్బన్‌ : జిల్లాలో చేపట్టిన ‘చంద్రన్న దళిత బాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖ మంత్రి రావెల కిషోర్‌ బాబు, ఎస్‌సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు సోమవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సంక్షేమ పథకాలపై ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, ప్రజ లకు  ఆవగాహన కల్పించేందుకు మధ్యాహ్న ం మూడు గంటలకు ఆర్ట్‌ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో  సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు   సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న  ఒక ప్రకటనలో తెలిపారు.    సదస్సుకు జిల్లాలోని దళిత, గిరిజన సామాజిక వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement