పోలీసులపై దాడి ఘటనలో మంత్రి అనుచరుడు.. | minister ravela follower pinki attacks on police in agiripalli | Sakshi
Sakshi News home page

పోలీసులపై దాడి ఘటనలో మంత్రి అనుచరుడు..

Jun 6 2016 7:26 PM | Updated on Aug 29 2018 7:45 PM

పోలీసులపై దాడి ఘటనలో మంత్రి అనుచరుడు.. - Sakshi

పోలీసులపై దాడి ఘటనలో మంత్రి అనుచరుడు..

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో పోలీసులపై దాడులకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు పాలేటి ఉమామహేశ్వరరావు అలియాస్ పింకీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ముఖ్య అనుచరుడని తెలుస్తోంది.

కృష్ణా జిల్లా: ఆగిరిపల్లిలో పోలీసులపై దాడులకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు పాలేటి ఉమామహేశ్వరరావు అలియాస్ పింకీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఈ ఘటనపై నార్త్‌జోన్ ఐజీ కుమార్ విశ్వజిత్ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా పింకీ అరాచకాలపై గ్రామస్తులు ఐజీ దృష్టికి తీసుకువచ్చారు. పింకీ మంత్రి రావెల పేరుతో గ్రామంలో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నాడని వాపోయారు. పింకీ మంత్రితో పాటు సీఎం చంద్రబాబునాయుడితో దిగిన ఫోటోలను ఐజీకు అందించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ యువతిని వెంటాడిన సమయంలో మంత్రి రావెల తనయుడితోపాటు పింకీ కూడా పక్కనే ఉన్నట్లు ఆయనకు చెప్పారు.


స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టమన్నందుకు రౌడీషీటర్‌గా ఉన్న పింకీ మరికొందరు తెలుగు తమ్ముళ్లు సోమవారం పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో టీడీపీ ఫ్లోర్ లీడర్ హరిబాబు కనకదుర్గ గుడి వద్ద హోంగార్డ్పై చేయిచేసుకున్నాడు. సోమవారం ఒక్క రోజే జిల్లాలో రెండు చోట్ల పోలీసులపై టీడీపీ నేతలు దాడులు చేయడంపై ఉన్నతాధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement