ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చనందున ఆయనపై సెక్షన్-420 కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాలకొల్లు సెంట్రల్ : ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చనందున ఆయనపై సెక్షన్-420 కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్లో సీఐ రజనీ కుమార్కు ఫిర్యాదు పత్రాలు అందజేశారు. హామీలను నెరవేర్చకుండా చంద్రబాబునాయుడు రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.