పంచాంగ నిర్వహణపై సదస్సు | meeting on panchangam | Sakshi
Sakshi News home page

పంచాంగ నిర్వహణపై సదస్సు

Aug 9 2016 11:17 PM | Updated on Sep 4 2017 8:34 AM

పంచాగ సదస్సు నిర్వహిస్తున్న పండితులు

విజయవాడ కల్చరల్‌ : 
లబ్బీపేటలోని శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో కంచిపీఠం ఆధ్వర్యాన మంగళవారం పంచాగ సదస్సు నిర్వహించారు. శంకర విజయేంద్ర సరస్వతి నేతృత్వంలో జరిగిన ఈ పంచాంగ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల పండితులు హారయ్యారు. అందరికీ అందుబాటులో ఒకే పంచాగం అమలు కోసం తీసుకోవాల్సిన విధివిధానాల గురించి పండితులు చర్చించారు. తిధి, వారాలు గణించం, శాస్త్రసమ్మతమైన  అంశాలను ప్రస్తావించడం వంటి అంశాలపై చర్చ సాగింది. బుధవారం కూడా ఈ సదస్సు నిర్వహిస్తామని పీఠం ప్రతిధిని తెలిపారు. తొలుత శ్రీమహాత్రిపురసుందరీ సమేత చంద్రమౌళ్వీశ్వర స్వామికి జయేంద్రస్వామి పూజలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 5.55 గంటలకు కంచి స్వాములు దుర్గాఘాట్‌లో కృష్ణవేణీ నదికి పూజలు నిర్వహించి, పుష్కర ప్రవేశ సమయంలో స్నానమాచరిస్తారని కంచిపీఠం మేనేజర్‌ సుందరేశ అయ్యర్‌ చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement