పేద వధూవరులకు వివాహం | marriage to poor couple | Sakshi
Sakshi News home page

పేద వధూవరులకు వివాహం

Nov 25 2016 9:43 PM | Updated on Sep 4 2017 9:06 PM

పేద వధూవరులకు వివాహం

పేద వధూవరులకు వివాహం

పట్టణంలోని శ్రీవాసవి సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం పేద ఆర్యవైశ్య వధూవరులకు వివాహం జరిపించారు..

తెనాలి: పట్టణంలోని శ్రీవాసవి సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం పేద ఆర్యవైశ్య వధూవరులకు వివాహం జరిపించారు. విజయవాడ వాస్తవ్యులు జల్లా వెంకటేశ్వర్లు, అన్నపూర్ణల కుమార్తె మాధవి వెంకట దుర్గ జ్యోత్స్నకు, నకిరికల్లు మండలం రూపినగుంట్లకు చెందిన సోము వెంకటేశ్వర్లు, శిరోమణి కుమారుడు శివరామాంజనేయులుకు వైశ్యవిద్యానిధి హాస్టలు ఆవరణలో వివాహం చేశారు. సంస్థ అధ్యక్షుడు చీమకుర్తి కృష్ణమూర్తి, కార్యదర్శి పెండేల సుబ్బారావు, మాడిశెట్టి గౌరేశ్వరరావు, కొణిజేటి వెంకటేశ్వరరావు, తాళ్లూరి లక్ష్మీనారాయణ, పెండేల వెంకటేశ్వర్లు, మద్ది రామకోటేశ్వరరావు, తాలిశెట్టి సుధాకరరావు, ఆలమూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement