వేముల ప్రశాంత్‌రెడ్డికి పలువురి పరామర్శ | Sakshi
Sakshi News home page

వేముల ప్రశాంత్‌రెడ్డికి పలువురి పరామర్శ

Published Tue, Aug 30 2016 12:46 AM

వేముల ప్రశాంత్‌రెడ్డికి పలువురి పరామర్శ

వేల్పూర్‌ : మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డిని నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోమవారం వేల్పూర్‌లో పరామర్శించారు. ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి శనివారం మరణించిన విషయం విదితమే. ఈ మేరకు వారి కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. వారి వెంట స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు రాములు, చిన్నారెడ్డి, మహిపాల్, రాములు, బాల్‌రాజ్, దయాకర్, భోజన్నయాదవ్‌ తదితరులు ఉన్నారు. అలాగే స్పీకర్‌ మధుసుధనాచారి కొడుకు క్రాంతితో పాటు వరంగల్‌ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పలñ ్లగంగారెడ్డితోపాటు నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్,రమేశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించి సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement