యంగ్ టాలెంట్
- మహిమా రాజ్పుత్
మిషన్ శక్తిశాట్
శక్తిశాట్ అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లో 108 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మన దేశం నుంచి పదవతరగతి చదువుతున్న మహిమా రాజ్పుత్ ఎంపికైంది.
ఉపగ్రహాలు, అంతరిక్ష మిషన్లకు సంబంధించి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఉపయోగపడే 365 పాఠాలను ఈ శిక్షణ కార్యక్రమంలో బోధిస్తారు.
నూట ఎనిమిది దేశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘మిషన్ శక్తిశాట్’లో ఉపగ్రహాల తయారీపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్ట్ 23న దిల్లీకి వెళ్తారు. అక్కడ, మిషన్లో భాగంగా ఉపగ్రహాల తయారీ ప్రక్రియలో పాల్గొంటారు. ఉపగ్రహాల తయారీతో పాటు ఇతరత్రా సాంకేతిక విషయాలపై పాఠశాల విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే ‘మిషన్ శక్తిశాట్’ అక్టోబర్లో మొదలవుతుంది.


