8 నాటికి ప్రతి ఇంటికి దీపం కనెక్షన్‌ | LPG gas connection to every house by 8 | Sakshi
Sakshi News home page

8 నాటికి ప్రతి ఇంటికి దీపం కనెక్షన్‌

May 31 2017 4:38 AM | Updated on Mar 21 2019 8:18 PM

వచ్చే నెల 8వ తేదీ నాటికి ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మండలాధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌
 
బీచ్‌రోడ్‌ (విశాఖ తూర్పు): వచ్చే నెల 8వ తేదీ నాటికి ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మండలాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ లేని లబ్ధిదారులు సుమారు మూడు లక్షల 20 వేల మంది ఉన్నట్లు సర్వేలో తేలిందన్నారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 1.4 లక్షల మందికి ఎల్‌పీజీ కనెక్షన్‌లకు సంబంధించి గ్రౌండింగ్‌ తప్పని సరిగా చేయాలన్నారు. ఇప్పటికి లక్ష 35 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 93 వేలు మాత్రమే అప్‌లోడ్‌ జరిగిందన్నారు.

గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా కంపెనీ కస్టమర్‌ ఐడీ జనరేటర్‌ చేయాలన్నారు. అదే విధంగా దీపం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. ఇంటింటికి సర్వే చేయడం, విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో ప్రణాళికను తయారు చేసుకొని రోజును 14 వేలు చొప్పున సర్వే చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌డీవోలు బాధ్యత వహించి సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో తక్కువగా గ్రౌండింగ్‌ అవుతున్నాయని, సర్వేను వేగవంతం చేయాలన్నారు. వచ్చే నెల నుంచి ఏజెన్సీ ప్రాంత మండలాలలో కిరోసిన్‌ సరఫరా ఆగిపోతుందని, సంబంధిత విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ జి.సృజన, జేసీ–2 డి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement