సిరిసిల్ల మండలం రగుడు వద్ద ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
May 8 2016 9:12 PM | Updated on Sep 3 2017 11:41 PM
సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా): సిరిసిల్ల మండలం రగుడు వద్ద ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సాయి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన ఎల్లమ్మ ప్రేమించుకుని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లిని అమ్మాయి తరపు బంధువులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన జంట వేములవాడకు వచ్చి రగుడు వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు.
Advertisement
Advertisement