రేపు వరసిద్ధుడి రథోత్సవం | lord vinayaka car festival tomorrow | Sakshi
Sakshi News home page

రేపు వరసిద్ధుడి రథోత్సవం

Sep 11 2016 12:40 AM | Updated on Sep 4 2017 12:58 PM

రథంపై కలశాలను ప్రతిష్టాపన

రథంపై కలశాలను ప్రతిష్టాపన

కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం జరగనున్న రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆలయ మూషిక మండపంలో రథ కలశాలు, గొడుగులు,బ్రహ్మను ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం,ప్రత్యేక పూజలు చేశారు.

 
ఐరాల: కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా  సోమవారం జరగనున్న రథోత్సవానికి  విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆలయ మూషిక మండపంలో రథ కలశాలు, గొడుగులు,బ్రహ్మను ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం,ప్రత్యేక పూజలు చేశారు.ఆ తరువాత గొడుగులు, రథసారథి ,బ్రహ్మకు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించి రథంపై ప్రతిష్టించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement