కర్నూలుకు చెందిన న్యాయవాది నాగమణి అద్దె వాహనంలో పుట్టపర్తికి వచ్చి తిరిగి వెళ్తుండగా ధర్మవరంలోని సబ్జైలు సమీపంలో రూరల్ పోలీస్ కానిస్టేబుల్ కారుతో వచ్చి ఆదివారం సాయంత్రం ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో న్యాయవాది ప్రయాణిస్తున్న కారు డోరు డ్యామేజీ అయ్యింది.
ఆయన స్పందించకపోవడంతో బాధితులు పట్టణ సీఐ హరినాథ్కు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వాహనాన్ని నడపడమే కాకుండా కారును ఢీకొన్నాడని బాధితులు పట్టణ సీఐకు తెలియజేశారు. సీఐ కేసు విచారిస్తున్నారు. తమకు రాత్రి 9 గంటలైనా న్యాయం చేయలేదని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు.