తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి | Labour worker died by bees attack | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి

Apr 20 2016 7:08 PM | Updated on Sep 3 2017 10:21 PM

ఉపాధి పనులకు వెళ్లిన వ్యక్తిపై తేనెటీగలు దాడి చేయడంతో.. అతను మృతిచెందాడు.

గడివేముల(కర్నూలు): ఉపాధి పనులకు వెళ్లిన వ్యక్తిపై తేనెటీగలు దాడి చేయడంతో.. అతను మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలం చెస్రవాయిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొరస్వామి ఉపాధి పనుల్లో భాగంగా జేసీ కెనాల్‌లో పూడిక తీయడానికి వెళ్లాడు.

ఈ క్రమంలో పనులు చేస్తుండగా.. తేనె టీగలు దాడి చేశాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన తోటి కూలీలు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement