కందనవోలు సంబరాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
ఈ నెల 24 నుంచి కందనవోలు సంబరాలు
Nov 7 2016 11:47 PM | Updated on Sep 4 2017 7:28 PM
–నిర్వహణకు రూ.20 లక్షల విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): కందనవోలు సంబరాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు కందనవోలు సంబరాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తాత్కాలికంగా నిర్ణయించింది. ఆందుకు రాష్ట్ర పర్యాటక శాఖ రూ.20లక్షలు మంజూరు చేసింది. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, కందనవోలు ఖ్యాతిని చాటి చెప్పే విధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నిర్ణయించారు. సంబరాల నిర్వహణకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
Advertisement
Advertisement