మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్‌మేళా | jobmela in kurnool and ongole | Sakshi
Sakshi News home page

మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్‌మేళా

May 11 2017 10:42 PM | Updated on Oct 4 2018 5:35 PM

మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ బాబా తాజుద్దీన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ బాబా తాజుద్దీన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైజింగ్‌ స్టార్స్‌ మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పనకు కర్నూలు, ఒంగోలులో రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 33 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 15 లోపు ఠీఠీఠీ.్చpటఝజఛి.ఛిౌఝ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–246615లో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement