రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా | jobmela by reddys lab | Sakshi
Sakshi News home page

రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

Dec 9 2016 11:42 PM | Updated on Sep 27 2018 5:12 PM

జిల్లాలోని ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ జమీర్‌ అహమ్మద్‌ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లాలోని ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ జమీర్‌ అహమ్మద్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ఈ జాబ్‌మేళా గుంటూరు, కర్నూలులో నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరులో ఈ నెల 16, 17న రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో ఈ నెల 22, 23న రాత పరీక్ష, ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఠీఠీఠీ.్చpటఝజఛి.ఛిౌఝ, వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–246615లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement