'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి' | Inter student compilants on two youth in tirupati | Sakshi
Sakshi News home page

'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి'

Jun 29 2016 7:28 PM | Updated on Sep 4 2017 3:43 AM

'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి'

'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి'

తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించిన ఓ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతి: తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించిన ఓ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ  ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రిక అనే ఇంటర్ విద్యార్థినిని ఓ ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించసాగారు. యశ్వంత్, నవీన్ అనే ఇద్దరు యువకులు ప్రతిరోజూ ఆమెను ప్రేమిస్తున్నామంటూ వేధిస్తూ వెంటబడేవారు. ఈ క్రమంలో వారి మాట వినలేదని ఆమెను బైక్తో ఢీకొట్టించారు. దాంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పుడా ఆ విద్యార్థిని మంచానికే పరిమితమైంది. వాళ్లు చాలా అమానుషంగా వ్యవహరించారని బాధితురాలు చంద్రిక వాపోయింది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో చంద్రిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో తిరుపతి పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. బాధితురాలు చంద్రిక డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ అంజూ యాదవ్లకు జరిగిన విషయాన్ని అంతా వివరించింది. చంద్రిక స్టేట్మెంట్ ను డీఎస్పీ రికార్డు చేశారు. తమకు న్యాయం చేయాలని చంద్రిక తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. యశ్వంత్, నవీన్ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిని వేధించిన నవీన్, యశ్వంత్లను పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement