ఐఐఐటీ-బి విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఐఐఐటీ-బి విద్యార్థి ఆత్మహత్య

Published Fri, Aug 11 2017 9:42 PM

iiit-b student suicides

బొమ్మనహళ్లి: ఐఐఐటీ-బీలో ఎంటెక్‌ 4వ సెమిస్టర్‌ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి  కళాశాల భవనం 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఎలక్ట్రానిక్‌ సిటీలో చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్‌ నగరానికి చెందిన సాయి శరత్‌ (22) ఎలక్ట్రానిక్‌ సిటీ మొదటి ఫేజ్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ-బీ)లో బెంగళూరు సంస్థలో ఎంటెక్‌ 4వ సెమిస్టర్‌ చదువుతూ క్యాంపస్‌లోని వసతి గృహంలో ఉంటున్నాడు. 

శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో సాయిశరత్‌ క్యాంపస్‌ 7వ అంతస్తుకు చేరుకొని కిందకు దూకి  ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement