నవజాత శిశువుల విభాగంలో భారీ అగ్నిప్రమాదం
ఏసీ నుంచి రేగిన మంటలు.. పొగ
భయంతో బిడ్డలతో సహా పరుగులు తీసిన బాలింతలు
తక్షణమే రంగంలోకి దిగి కిందికి తరలించిన ఆస్పత్రి సిబ్బంది
వారి అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం
రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా
షార్ట్ సర్క్యూటే కారణమంటున్న అధికారులు
సాయంత్రం నాలుగ్గంటల సమయం.. అది ఘోషా ఆస్పత్రి నవజాత శిశువుల విభాగం.. మూడంతస్తుల ఆ విభాగంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు.. విపరీతమైన పొగ.. ఆ అంతస్తులోని వార్మర్లలో అప్పుడే పుట్టిన శిశువులు.. వారి చెంత తల్లులు ఉన్నారు..
ఒక్కసారిగా రేగిన మంటలు, పొగ.. వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.. భయకంపితులను చేశాయి.. వార్మర్లలో ఉన్న బిడ్డలను పట్టుకొని.. భయంతో పరుగులు తీశారు.. అదే సమయం ఆస్పత్రి సిబ్బంది ఉరుకులు.. పరుగుల మీద వచ్చి.. ఆ అంతస్తులో ఉన్న వారందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.. దాంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది.. ప్రమాదానికి విద్యుత్ షార్ట్స్క్యూట్ కారణమని అంటున్నా.. ఇంకేమైనా లోపాలున్నా యేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): పాతనగరంలోని ప్రభుత్వ విక్టోరియా(ఘోషా) ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంతో రోగులు, బాలింతలు హాహాకారాలు పెట్టారు. ఆస్పత్రిలోని నవజాత శిశువుల విభాగంలోని వార్మర్లు ఉండే అంతస్తులోని ఓ ఏసీ మిషన్ నుంచి సాయంత్రం 4.10 గంటల సమయంలో ఒక్కసారిగా పొగలు, ఆ వెంటనే మంటలు రేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే అప్పటికే ఏసీ నుంచి రేగిన మంటలు, నల్లటి పొగ ఆ అంతస్తు మొత్తానికి వ్యాపించడంతో అక్కడే ఉన్న బాలింతలు భయంతో కంపించిపోయారు. ఆ సమయంలో వార్మర్లలో 9మంది శిశువులు ఉన్నారు. తల్లులు తమ బిడ్డలను పట్టుకొని భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆస్పత్రి సిబ్బంది నవజాత శిశువులను, తల్లులను కిందికి తరలించారు. ఆక్సిజన్ సిలెండర్ల కనెక్షన్లు తొలగించి.. సిలెండర్లను కిందకు చేర్చారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.
భారీ నష్టం
ప్రాణ నష్టం తప్పినా.. ఆస్తినష్టం మాత్రం భారీగానే వాటిల్లింది. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే 12 వార్మర్లు, 7 ఫోటో థెరపీ యంత్రాలు, 7 పల్సాక్సి మీటర్లు, 2 ఆక్సిజన్ యంత్రాలు, 3 ఏసీలు దెబ్బతిన్నాయి. నాలుగు వార్మర్లు, మూడు ఫోటో థెరపీ యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. వార్మర్లలో ఉన్న 9 మంది చిన్నారులను కిందకు చేర్చిన తర్వాత.. వారిలో ముగ్గురిని కేజీహెచ్కు తరలించి.. మిగిలిన వారిని ఘోషా ఆస్పత్రిలోనే ప్రసూతి వార్డులో ఉంచారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. నిచ్చెన సాయంతో ప్రమాదం సంభవించిన అంతస్తుకు చేరుకుని అద్దాలు పగులగొట్టి కిటికీలు తెరవడంతో అంతవరకు దట్టంకా అలుమున్న నల్లటి పొగ బయటకు వెళ్లిపోయింది. మంటలను అదుపు చేయడంతో పాటు మరింతగా వ్యాపించకుండా ఆ పరిసరాలను పూర్తిగా నీటితో తడిపారు. పగటిపూట కాకుండా అగ్నిప్రమాదం రాత్రి జరిగి ఉంటే పెను నష్టం వాటిల్లేది. అందరూ నిద్రావస్థలో ఉంటారు కనుక భారీ ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉండేదని అంటున్నారు.
రూ.25 లక్షల నష్టం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మలీల చెప్పారు. ఏసీ నుంచి పొగలు, మంట రావడం గమనించి సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. వారి అప్రమత్తత కారణంగానే ప్రాణానష్టం తప్పిపోయిందన్నారు. ఏసీలు, వార్మర్లు, ఇతర పరికరాలు కాలిపోవడం వల్ల సుమారు రూ.25 లక్షల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉందని ఆమె చెప్పారు.
ప్రమాద ఘోష
Published Sat, Feb 18 2017 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement