పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత | high tension at parvathipuram itda office | Sakshi
Sakshi News home page

పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత

Oct 3 2015 12:44 PM | Updated on Sep 3 2017 10:23 AM

తమ సమస్యలు పరిష్కరించాలంటూ గిరిజన హాస్టల్ విద్యార్థులు శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

విజయనగరం : తమ సమస్యలు పరిష్కరించాలంటూ గిరిజన హాస్టల్ విద్యార్థులు  శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అందులోభాగంగా కార్యాలయంలో జరుగుతున్న పాలక మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు.

ఆ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి.. విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement