ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఆడశిశువు మృతదేహం కలకలం రేపింది.
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఆడశిశువు మృతదేహం కలకలం రేపింది. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్ ఆప్రాన్ సమీపంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని చలిలో వదిలి వెళ్లడం వల్లే మృతిచెంది ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.