తెల్లబోయిన నల్లధనం | Gharana fraud gang in order to change the currency in Vijayawada | Sakshi
Sakshi News home page

తెల్లబోయిన నల్లధనం

Nov 21 2016 12:20 AM | Updated on Jun 4 2019 6:31 PM

తెల్లబోయిన నల్లధనం - Sakshi

తెల్లబోయిన నల్లధనం

నగరంలోకి నకిలీ కరెన్సీ వస్తోంది. విజయవాడ నుంచి నకిలీ రూ.2000 నోట్లు వస్తున్నట్టు తెలుస్తోంది.

కరెన్సీ మార్చే క్రమంలో విజయవాడ ముఠా ఘరానా మోసం
పాత నోట్లకు బదులు కొత్త నకిలీ నోట్లు
నగరానికి చెందిన వ్యాపారికి రూ.15లక్షలు టోకరా

హన్మకొండ చౌరస్తా : నగరంలోకి నకిలీ కరెన్సీ వస్తోంది. విజయవాడ నుంచి నకిలీ రూ.2000 నోట్లు వస్తున్నట్టు తెలుస్తోంది. పాత నోట్ల మార్పిడికి కమీషన్‌పై కొత్త నోట్లు ఇస్తామని నమ్మబలుకుతూ స్థానికులను ముగ్గులోకి దించుతున్నారు. వీరి మాటలు నమ్మి ఇప్పటికే పలువురు ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్నారు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. కరెన్సీ మార్పిడి విషయమై నగరానికి చెందిన ఓ వ్యాపారితో విజయవాడకు చెందిన ఏజెంట్ చర్చలు జరిపాడు. పాత రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే కొత్త రూ.2000 నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో సదరు వ్యాపారి రూ.20 లక్షల రూపాయలు ఆ ఏజెంట్‌కు సమర్పించాడు. బదులుగా రూ.2000 నోట్లతో  15లక్షల రూపాయల నగదు అందింది. తన బ్లాక్‌మనీ వైట్‌గా మారిందనే సంతోషం ఆ వ్యాపారికి ఎంతో సేపు లేదు. కమీషన్ ఏజెంట్ అందించిన రూ.2000 నోట్లు పూర్తిగా నకిలీవి.

కలర్ జిరాక్స్ ద్వారా కొత్త రూ.2000 నోట్లను పోలిన నకిలీ నోట్లు అందించినట్లు గ్రహించాడు. తాను మోసానికి గురైన విషయం ఎవరికీ చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నాడు. ఈ విషయం  నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముఠా వలలో ఇంకా పలువురు వ్యాపారులు చిక్కుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దుతో వరంగల్ నగరంలో చాలా మంది వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో నగదు పేరుకుపోరుుంది. బ్యాంకుల నుంచి మార్చుకుందామంటే ఐటీ శాఖ ఇబ్బందులు ఉండటంతో అడ్డదారులను ఆశ్రరుుస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement