మానకొండూర్ : తిమ్మాపూర్ మండలం నేదునూర్లో నిర్మించతలపెట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ పవర్ప్లాంట్కు ప్రహరీ ఏర్పాటు కోసం మంగళవారం వచ్చిన జెన్కో సీఎండీ ప్రభాకర్రావును భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే ప్రహరీ నిర్మించాలంటూ సుమారు 200 మంది ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. 2010లో పవర్ప్లాంట్కు అప్పటి సీఎం రోశయ్య శంకుస్థాపన చేశారని, తమ పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందించారని, అనంతరం విస్మరించారని ఆరోపించారు. న్యాయం చేసేవరకూ పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. ప్రహరీ నిర్మిస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందని, సుమారు రూ.400 కోట్ల వరకు నిధులువచ్చే అవకాశముందని సీఎండీ నచ్చజెప్పినా నిర్వాసితులు వినిపించుకోలేదు. దీంతో గత్యంతరం లేక ఆయన వెళ్లిపోయారు.
Related news
-
పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి
పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి -
ముందస్తు కుట్రతోనే సీఎం జగన్పై హత్యాయత్నం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయి దాడి పక్కాప్లాన్, ముందస్తు కుట్రతో జరిగిందని మరోసారి తేటతెల్లమైంది. ఏ2 పోద్బలంతోనే సీఎం జగన్పై రాయితో దాడిచేసినట్లు ప్రధాన నిందితుడు (ఏ1) వేముల సతీష్కుమార్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. వివేకానంద స్కూల్ వద్ద కంటే ముందు డాబా కొట్ల కూడలిలోనే రాయి విసిరేందుకు మొదట ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. న్యాయస్థానం ప్రత్యేక అనుమతితో విచారణ నిమిత్తం ఈ నెల 25వ తేదీన నిందితుడు సతీష్ ను పోలీసులు మూడురోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు రోజులు సతీష్ను అతడి తండ్రి దుర్గారావు, అతడి న్యాయవాది సమక్షంలో సింగ్నగర్ పోలీస్స్టేషన్లో విచారించారు. శనివారం కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడిని పోలీసులు సబ్జైలులో అప్పగించారు. మూడురోజుల విచారణ, సీన్ రీ కన్స్ట్రక్షన్కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సీల్డ్ కవర్లో న్యాయాధికారికి అందజేశారు. విచారణలో నిందితుడు పూర్తిగా సహకరించలేదని, అతడు ఇంకా ఏదో దాస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా నిందితుడిని విచారించాల్సి ఉందని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మూడురోజుల విచారణలో దాడికి సంబంధించిన పలు కుట్రపూరిత అంశాలను సతీష్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్నగర్లోని వివేకానంద స్కూల్ వద్ద సీఎం జగన్పై హత్యాయత్నం వెనుక ఏ2తో పాటు, మరికొందరి కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ఆ రోజు ఉదయం నిందితుడు వేముల సతీష్కుమార్ కూలిపనికి వెళ్లాడు. అదేరోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సెంట్రల్ నియోజకవర్గంలో ఉండటంతో హత్యాయత్నానికి వారు కూలిపని చేస్తున్న ప్రదేశంలోనే స్కెచ్ వేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఎలా దాడిచేయాలి? ఎలా తప్పించుకోవాలి? దాడిచేస్తే ఎంత డబ్బు చెల్లిస్తారు? వంటి అంశాలను ఏ1తో కలిసి ఏ2 చర్చించాడు. ప్రధానంగా పోలీసులు ఏ2గా అనుమానిస్తున్న వ్యక్తి ప్రోద్బలంతోనే ఏ1 సతీష్ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారు నివసించే వడ్డెర కాలనీ అరుగు మీద ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల వరకు ఈ కుట్ర ఎలా అమలు చేయాలనే అంశంపై వారు చర్చించారు. అనంతరం సతీష్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ సింగ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో సీఎం జగన్ బస్సుయాత్ర గవర్నమెంట్ ప్రెస్ కూడలి దాటి ఫ్లైఓవర్పై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరో రెండు నిమిషాల్లో యాత్ర తాను నిలబడిన (డాబాకొట్లు) సెంటర్ వద్దకు చేరుకుంటుందని గ్రహించిన నిందితుడు సతీష్ వంతెన వద్దే ఓ కాంక్రీట్ రాయిని సేకరించాడు. ఆ సమయంలో సతీష్తో పాటు అతడి స్నేహితుడు ఉన్నాడు. బస్సుయాత్ర డాబాకొట్లు సెంటర్కు చేరుకోగానే అప్పుడే సీఎం జగన్పై రాయి విసేరేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వద్దని, ఎవరైనా చూస్తే దొరికిపోతామని సతీష్ను అతడి స్నేహితుడు వారించి నిలువరించాడు. భయపడిన ఆ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సుయాత్ర వివేకానంద స్కూల్ వద్దకు చేరడానికి ముందే సతీష్ వేగంగా స్కూల్, గంగానమ్మ గుడి మధ్యనున్న చీకటి ప్రాంతానికి చేరుకున్నాడు. ముందే సేకరించిన కాంక్రీట్ రాయితో ఆ ప్రదేశం నుంచే సీఎం జగన్పై దాడిచేశాడు. రాయి బలంగా విసరడంతో సీఎం జగన్తో పాటు ఆయన పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. దాడిచేసిన వెంటనే తన ఇంటికెళ్లిన సతీష్ అక్కడే ఉన్న టీడీపీ నాయకులను కలిశాడు. తరువాత వారంతా అక్కడ టపాసులు కాల్చారు. ఈ విషయాలన్నీ పోలీసులు నిర్వహించిన సీన్ రీ కన్స్ట్రక్షన్లో నిర్ధారణ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
పద్మవ్యూహంలో వీర అర్జునుడు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్ను తిట్టి పోస్తారు. దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం
గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జయశంకర్నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్డౌన్ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. తన్నుకున్న తమ్ముళ్లు.. ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్ కార్యాలయం ఆవరణంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. -
టీడీపీ దాడిలో గాయపడిన వెంకటరెడ్డి కన్నుమూత
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ ఆళ్ల అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కనీ్వనర్ మున్నంగి వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్నాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల అదుపులో నిందితులు కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ తన కొడుకైన రౌడీషీటర్ను, కొందరు యువకులను తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనంపైన వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు, ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్ను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆ వాహనాన్ని, గురువర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గురువర్ధన్ను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్ను పోలీస్స్టేషన్లో అప్పగించారు. తరువాత తమ అనుకూల మీడియాలో వైఎస్సార్సీపీకి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వారు తమ కార్యకర్తలే కాదంటూనే.. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న వారిని వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారని, బైక్ బ్రేక్ ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం చేయసాగారు. వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్తో ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
Related News by category
-
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ’
హుజూరాబాద్: మాదిగల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ నమ్మించి ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి హుజురా బాద్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు,నాలుగు సీట్లు రావాల్సి ఉండగా ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెడ్డిలకు ఆరుసీట్లు, 50శాతం పైన ఉన్న బీసీలకు రెండు సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వంతో మాదిగలు నష్టపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎవరూ ఓటు వేయద్దని సూచించారు. బీజేపీ తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చామని అన్నారు. నాయకులు రుద్రారపు రామచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వెంకట్ స్వామి, డాక్టర్ తడికమళ్ల శేఖర్, బొరగల సారయ్య, రాజు పాల్గొన్నారు. ఏజీని కలిసిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కరీంనగర్క్రైం: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బి.సుదర్శన్ రెడ్డిని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షల ఇన్సూరెన్స్ను రూ.5లక్షలకు పెంచాలని, కొత్త సభ్యులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల స్టైఫండ్ ఇవ్వాలని వినతిపత్రం అందించగా.. సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్గా మహేందర్కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్గా దగ్గు మహేందర్ రాకేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేందర్ కన్వీనర్గా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహేందర్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన సహచర కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేయర్ యాదగిరి సునీల్రావును మహేందర్ రాకేశ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మర్యాదకపూర్వకంగా కలిశారు. మహేందర్కు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. -
అశ్వవాహనంపై రామయ్య
ఇల్లందకుంట: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరా మనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శేషం రామాచార్యులు, అర్చకుడు శేషం వంశీధరచార్యులు మంత్రోచ్ఛారణ మధ్య స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, సురేందర్రెడ్డి, కడారి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్, పెద్దికుమార్ పాల్గొన్నారు. -
కంగ్రాట్స్.. సహన
● సివిల్స్ ర్యాంకర్కు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ‘మారం’ అభినందన కరీంనగర్ అర్బన్: సివిల్స్లో ర్యాంకు సాధించిన కొలనుపాక సహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సివిల్స్లో కరీంనగర్ యువత సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. సహన సివిల్స్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సహన మంచి అధికారిగా సేవలందించి కరీంనగర్ పేరును చిరస్థాయిగా నిలపాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, మహిళా జేఏసీ చైర్పర్సన్ ఇరుమల్ల శారద, సబిత, సునీత, శైలజ, సుస్మిత, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్విని కుమార్ పాండేనేటి నుంచి ఇంటింటికీ కాంగ్రెస్కరీంనగర్: ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని ఎంసీఎంసీ కమిటీ సభ్యులకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్వినికుమార్ పాండే సూచించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లోని మీడియా సెంటర్, కంట్రోల్రూంను పరిశీలించారు. మీడియా సెంటర్ పనితీరుతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే ఎన్నికల ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెయిడ్ ఆర్టికల్స్ను పర్యవేక్షిస్తూ వ్యయ వివరాలు నమోదు చేయాలన్నారు. కంట్రోల్రూం పనితీరును అడిగి తెలు సుకున్నారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చిన కేసులు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార, పౌర సంబంధాలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కొండయ్య, ఏపీఆర్ఓ వీరాంజనేయులు, కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ ఎస్.నాగార్జున పాల్గొన్నారు. ● సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పంచ న్యాయాల (పాంచ్న్యాయ్) గ్యారంటీ కార్డులను నగరంలోని ప్రతీ గడపకు తీసుకెళ్తామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలిపారు. శనివారం నుంచి ఇంటింటికి వెళ్లి పంచ న్యాయాలు అందజేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. శుక్రవారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల తరహాలోనే కేంద్రంలో కాంగ్రెస్ పాంచ్న్యాయ్ను అమలు చేయనుందన్నారు. ఇటీవల తుక్కుగూడ సభలో రాహుల్గాంధీ ప్రకటించిన ఈ పంచన్యాయాల గ్యారంటీ కార్డులను ప్రతీ గడపకు చేరుస్తామన్నారు. కేంద్రం నుంచి రొటీన్గా వచ్చే నిధులు కాకుండా, సొంతంగా తీసుకొచ్చినవేమిటో, పనులేమిటో బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ఎంపీగా, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా పూర్తిగా వి ఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ హ యాంలో నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం వల్లే నగరం స్మార్ట్సిటీకి అర్హత సాధించిందన్నారు. వీటిని ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోతా మన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బిజీ షెడ్యూ ల్ వల్ల, సమాచారలోపంతో తాను కార్యక్రమానికి హాజరుకాలేకపోయానన్నారు. నాయకులు ఎండీ.తాజొద్దీన్, శ్రవణ్నాయక్, బొబ్బిలి విక్టర్, సమద్ నవాబ్, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కాంగ్రెస్కు మరో దెబ్బ! పార్టీకి పరిశీలకుల గుడ్బై!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
Advertisement