
వైఎస్సార్సీపీని బలోపేతం చేయండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో బలోపేతం చేయూలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు.
► రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి
►పార్టీలో సీనియర్ నాయకుడు జిలానీ చేరిక
ఆదిలాబాద్ రిమ్స్/నేరడిగొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో బలోపేతం చేయూలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ జిలానీ సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో గట్టు శ్రీకాంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేయూలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి తడపత్రి తిలక్రావు, బోథ్ నియోజకవర్గ నాయకులు జాదవ్ ప్రవీణ్నాయక్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల కన్వీనర్లు రాజశేఖరరెడ్డి, షేక్ సాదుల్లా, యువజన నాయకుడు లింగం, తదితరులు పాల్గొన్నారు.