కారు అదుపుతప్పి న ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
- ఐదుగురికి గాయాలు
అరకులోయ(విశాఖ)
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులోయలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని రవిచంద్రనగర్కు చెందిన ఓ కుటుంబ సభ్యులు అరకు లోయ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిషోర్(14)ను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.