కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్న భక్తులపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్న భక్తులపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత నాలుగు రోజులు ఎండలు విపరీతంగా ఉండటంతో.. భక్తులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి నుండి తమను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు విజయవాడ పుష్కర ఘాట్లలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.