Subtropical
-
యారప్లో నిప్పులు చెరుగుతున్న భానుడు
-
నేడు ఉరుములతో గాలివానలు
బూర్గుంపాడులో 11 సెంటీమీటర్ల భారీ వర్షం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు మోస్తరు వర్షాలతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రుతుపవన ద్రోణి ఉత్తర దిశగా హిమాలయాలవైపు వెళ్లిపోవడంతో రుతుపవనాలు బలహీనమయ్యాయి. దీంతో ఎండలు పెరుగుతున్నాయి. తేమ ఎక్కువ ఉండటం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడా మంగళవారం ఉరుములతో కూడిన గాలివానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరో 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బూర్గుంపాడులో 11 సెం.మీ. భారీ వర్షం కురిసింది. డోర్నకల్లో 7, బోనకల్, గంగాధరలలో 6 సెం.మీ, వెంకటాపూర్, గార్ల, భద్రాచలం, పాలకుర్తి, హసన్పర్తిలలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..: మరోవైపు రాష్ట్రంలో అనేక చోట్ల ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో మెదక్లో ఐదు డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పూర్వ జిల్లా కేంద్రాలన్నింటా 2 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్లో 3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డు అయింది. రాత్రి ఉష్ణోగ్రత కూడా నగరంలో 3 డిగ్రీలు అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. -
4 రోజులు ఓ మోస్తరు వర్షాలు
► అయినా ఎండలు ఎక్కువగానే.. సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 4 రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవ కాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయినా ఎండలు మాత్రం సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగానే ఉంటాయని స్పష్టంచేసింది. ఇక బుధవారం ఎండలు మండి పోయాయి. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో 23 మంది మృతి రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో బుధవారం వేర్వేరుచోట్ల 23 మంది మృతి చెందారు. పాత వరంగల్ జిల్లాలో 12 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదుగురు, రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కొక్క రు చొప్పున మృతి చెందారు. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 45.1 నల్లగొండ 45.0 నిజామాబాద్ 45.0 మెదక్ 44.9 రామగుండం 44.8 మహబూబ్నగర్ 44.5 హన్మకొండ 44.0 భద్రాచలం 43.6 హైదరాబాద్ 43.2 హకీంపేట 41.8 ఖమ్మం 41.2 -
మండే సూరీడు
►రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత ►ఉక్కపోతతో అల్లాడుతున్న జనం తిరుపతి తుడా: ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో రహదారులన్నీ కర్ఫ్యూను తలపించేలా నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండతీవ్రత అధికంగా ఉండడంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు వేడి గాలుల ప్రభావం మొదలు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేళల్లో కొంతమేర చల్ల గాలు లు వీస్తుండడంతో ఉపశమనం కలుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జిల్లాలో 50.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈసారి ఏప్రిల్ మూడో వారంలోనే 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక ఏప్రిల్ చివరివారం, మేలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా చిత్తూరు రికార్డుల్లోకి ఎక్కింది. సోమవారం మరో 0.3 డిగ్రీలు పెరిగింది. హెచ్చరికలు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తూర్పు బంగాళా ఖాతంలో ఎన్నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. -
అగ్గి భగ్గు
= సండే, మండే ఎండే = నేడు, రేపు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు = ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దు = వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన = అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం = పాఠశాలల వేళలు సైతం కుదింపు ఒంగోలు టౌన్/కారంచేడు: ప్రచండ భానుడు భగభగమంటున్నాడు. ఏప్రిల్ మాసంలోనే తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పుడే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్న ప్రజలకు వాతావరణ నిపుణుల హెచ్చరికలు మరింత హడలెత్తిస్తున్నాయి. రానున్న రెండురోజులు ఆది, సోమవారాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ప్రజల్ని అప్రమత్తం చేయాలి :డీఆర్వో : రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యలో ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలు జిల్లాకు వచ్చాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరూ బయట తిరగరాదన్నారు. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో మైకులు, దండోరాలతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో పశువులను కూడా బయటకు వదలరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలలను ఉదయం 10 గంటలకే మూసివేయాలన్నారు. ఉపాధి కూలీలు ఉదయం 10గంటలకే పనులు ముగించుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ ఉదయం 9గంటలకే పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లు అవసరమైన మేరకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కాన్ఫరెన్స్లో సీపీఓ భరత్కుమార్, డీఎంహెచ్ఓ యాస్మిన్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, డీపీఓ ప్రసాద్, పశుసంవర్థకశాఖ జేడీ రజనీకుమారి పాల్గొన్నారు. పాఠశాలల వేళలు కుదింపు..: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలని అధికారులు సూచించారు. జిల్లాలో శనివారం 25 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దారవీడు – 42.78 మార్కాపురం – 42.53 మర్రిపూడి – 42.36, పొదిలి – 42.10, వెలిగండ్ల – 41.79, రాచర్ల – 41.55, ముండ్లమూరు – 41.51, బల్లికురవ – 41.24, సీఎస్పురం – 41.15, అద్దంకి – 40.48, అర్ధవీడు – 40.30, దొనకొండ – 40.39, దోర్నాల – 40.87, గుడ్లూరు – 40.58, హనుమంతునిపాడు–40.66, కనిగిరి – 40.92, కొమరోలు – 40.89, కొనకనమిట్ల –40.54, కొండపి – 40.58, పామూరు – 40.83, పొన్నలూరు – 40.06, సంతనూతలపాడు– 41.0, తర్లుపాడు – 40.62, తాళ్లూరు – 40.87, త్రిపురాంతకం – 40.26 -
జలం.. అథః పాతాళం
మండే ఎండలకు ఆవిరైపోతున్న నీరు 26.50 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భజలాలు 44 మండలాల్లో ప్రమాద ఘంటికలు ఒట్టిపోతున్న బోరుబావులు నిలువునా ఎండిపోతున్న పండ్లతోటలు రానురాను మరింత కష్టం సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మండే ఎండలకు నీటి వనరులు నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోయాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా సరాసరి నీటి మట్టం 26.50 మీటర్లకు చేరింది. మొత్తమ్మీద 44 మండలాల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో మరింత కఠిన పరిస్థితులు తప్పవని అధికారులతో పాటు ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది 553 మిల్లీమీటర్ల (మి.మీ) సాధారణ వర్షపాతం నమోదు కావాల్సివుండగా.. కేవలం 290 మి.మీ నమోదైంది. జూన్, జూలై మినహా ఒక్క నెలలో కూడా సాధారణ వర్షం కురవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మంచి వర్షాలు పడాల్సివుండగా వరుణుడు పూర్తిగా మొహం చాటేశాడు. ఈ క్రమంలో భూగర్భజలాలు క్షీణించిపోతున్నాయి. గత డిసెంబర్లో 20 మీటర్లు, ఈ ఏడాది జనవరిలో 22 మీటర్లు, ఫిబ్రవరి 23 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 26 నుంచి 27 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. తాజా నీటిమట్టం సగటున 26.50 మీటర్లుగా నమోదైనా.. దాదాపు 44 మండలాల్లో సగటుకన్నా లోతుకు పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది. యాడికి మండలం నగరూరులో 82 మీటర్లు, గాండ్లపెంటలో 80, అగళి 77, లేపాక్షి మండలం పులమతి, శిరివరం 69, రొద్దం మండలం శ్యాపురం 67, అమరాపురం 65, మడకశిర మండలం ఆర్.అనంతపురం 60, గోరంట్ల మండలం పులగూర్లపల్లి 56, పరిగి 55, బుక్కపట్నం మండలం పి.కొత్తకోట 53, మారాల 52, సోమందేపల్లి మండలం చాలకూరు 51, పెనుకొండ 51, గుమ్మఘట్ట మండలం తాళ్లకెరె 50, రాప్తాడు మండలం మరూరు 48, బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి 46, గుడిబండ మండలం కుమ్మరనాగేపల్లి 44, హిందూపురం మండలం మణేసముద్రం 44, తాడిమర్రి మండలం పిన్నదరి 43, నల్లచెరువు మండలం జోగన్నపేట 42, హిందూపురం మండలం మలుగూరులో 42 మీటర్ల లోతుకు భూగర్భజలాలు చేరుకున్నాయి. చివరి స్థానంలో ‘అనంత’ భూగర్భజలాల విషయంలో ‘అనంత’ చివరి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సగటు నీటిమట్టం 13.99 మీటర్లు ఉండగా.. అందులో రాయలసీమ జిల్లాల సగటు 19.80 మీటర్లు. అలాగే కోస్తా జిల్లాల సగటు నీటిమట్టం 11.40 మీటర్లుగా నమోదైంది. సీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు జిల్లా 10.82 మీటర్లు, చిత్తూరు జిల్లా 19.80 మీటర్లు, వైఎస్సార్ జిల్లా నీటిమట్టం 22.37 మీటర్లుగా నమోదైంది. ‘అనంత’లో మాత్రం పరిస్థితి ఘోరంగా ఉండటంతో చివరిస్థానంలో నిలిచింది. పంటలు, పండ్లతోటలు ఎండుముఖం కుంటలు, చెరువులు నీళ్లు లేక నెర్రెలు చీలాయి. కొండలు, గుట్టలు పచ్చదనం లేక బోసిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా చాలా మండలాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు ఈ సమస్య మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక గ్రాసం లేక పశువులు, జీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. వందల ఎకరాల్లో మల్బరీ, పండ్లతోటలు ఎండుముఖం పట్టాయి. 70-80 వేల బోర్లు ఎండిపోవడంతో అధికారికంగా 4,500 ఎకరాల్లో మల్బరీ, 1,500 ఎకరాల్లో పండ్లతోటలు ఎండిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మున్ముందు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే పంటలు, పండ్లతోటలు, పశువుల మనుగడకు విఘాతం ఏర్పడే ప్రమాదముంది. -
వడదెబ్బ నుంచి తప్పించుకోండిలా..
నిడమర్రు: రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ అంటే ఏమిటి.. దాని లక్షణాలు.. నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. - వడదెబ్బ అంటే..? ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటాన్ని వడదెబ్బ అంటారు. అత్యధిక వేడి వాతావరణం లేదా అధిక శారీరక శ్రమను శరీరం తట్టుకోలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈస్థితిలో శరీరంలో సహజంగా జరగాల్సిన చర్యలు జరగకపోవడం వల్ల దాని ప్రభావం అవయవాల పనితీరుపై పడుతుంది. దాంతో వడదెబ్బ తగిలిన వ్యక్తి నీరసించి కుప్పకూలిపోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది. -లక్షణాలు -గుండె / నాడి కొట్టుకునే వేగంలో ఆకస్మిక మార్పు, వేగంగా / తక్కువగా శ్వాస తీసుకోవడం, చెమట పట్టకపోవడం, ఎక్కువ/ తక్కువ రక్తపోటు, చిరాకు, కంగారు, తలతిరగడం, శరీరం గాలిలో తేలిపోతున్నట్టు ఉండటం, తలపోటు, వికారం, వాంతులు, అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ తగిలినవారిలో సహజంగా కనిపించే లక్షణాలు. -ప్రాథమిక చికిత్స -వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకొచ్చి ఆ వ్యక్తి శరీరాన్ని చల్లబరచాలి. రోగి శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. -రోగి తాగ గలిగితే చల్లటి పానీయాలు ఇవ్వాలి. వదులు దుస్తులు కట్టాలి. - ఎటువంటి మందులు ఇవ్వకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి ముందు జాగ్రత్తగా - వేసవిలో డీ హైడ్రేషన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ను వెంట తీసుకెళ్లాలి. నీరు శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. - ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎండలో పనిచేసేవారయితే మధ్యమధ్యలో నీడ పట్టుకు వచ్చి సేదతీరుతూ ఉండాలి. -గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు సాధారణ వ్యక్తుల కంటే తొందరగా డీ హైడ్రేషన్ ప్రభావానికి గురవుతారు. -ఆల్కహాల్, సిగరెట్, కార్బోనేటెడ్ ద్రావణాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల శరీరంలో ఉండే నీటి నిల్వలు తొందరగా తగ్గిపోతాయి. - ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్గ్లాస్, తలకు టోపీ వంటివి ధరించడం మంచింది. -వేసవి కాలంలో బయటకు వెళ్లే అవసరం ఉంటే ఉదయ, సాయంత్రం వేళల్లో మాత్రమే వెళ్లేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. -వేడి వాతావరణంలో శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు చేయడం మంచింది కాదు. ఒక వేళ శారీరక శ్రమ అధికంగా ఉండే వృత్తుల్లో ఉన్నవారయితే తరచూ శక్తినిచ్చే పానీయాలు తాగాలి. -ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి, కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. - బయటకు వెళ్ళిన సందర్భాల్లో టీ, కాఫీ, వేపుడు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్స్ మానెయ్యాలి. వాటి బదులుగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి -ప్రయాణాల్లో సోడియం వంటి ఎలక్ట్రోలైట్ ద్రావణాలను త్రాగటం మంచిది - వేసవిలో వాంతులు, అలసట, బలహీనంగా కనిపించడం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. ––––––––––––––––––––––––––––– వయసుతో నిమిత్తం లేదు ఏ వయసువారైనా వడదెబ్బ బారిన పడొచ్చు. వారిలో పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మధుమేహ వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యపానం అలవాటు ఉన్న వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. అలాగే కొన్ని రకాల ఔషధాలు కూడా వడదెబ్బకు కారణమవుతాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.-– పి.సతీష్కుమార్రాజు, వర్మ హాస్పిటల్, గణపవరం -
ఈసారి నిప్పుల కొలిమే!
-
ఈసారి నిప్పుల కొలిమే!
అధిక ఉష్ణోగ్రతలకు కారణాలివే... ⇒ ఆయా ప్రాంతాల్లో హరిత వాతావరణం (గ్రీన్బెల్ట్) తగ్గడం ⇒ ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి వీచే వేడి గాలులు ⇒ వాహనాల కాలుష్యం, గ్రీన్హౌజ్ వాయు ఉద్గారాలు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎండలు మండిపోనున్నాయి. రోహిణి కార్తెలోనే కాదు ఎండా కాలమంతా రోళ్లు పగిలేలా ప్రతాపం చూపించనున్నాయి. వడగాడ్పులు విజృంభించనున్నాయి. మొత్తం గా ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ సంస్థలు హెచ్చరించాయి. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు గత 116 ఏళ్లలో జనవరి అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాయని వెల్లడించాయి. తెలంగాణ, ఏపీలతో పాటు మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని హెచ్చరించాయి. గతేడాది కంటే ఎక్కువగా.. ఈసారి తెలంగాణలో వడగాడ్పులు సాధారణం కంటే 47 శాతం అధికంగా వీస్తాయని, ఇది గతేడాది కంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ‘‘1981–2010 మధ్య ముప్పై ఏళ్ల సరాసరి ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 రోజుల సరాసరి సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే ఒక రోజు 4 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. మరోరోజు 5 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. ఇంకోరోజు సాధారణం కంటే తక్కువగానూ నమోదు కావచ్చు’’అని వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే ఎల్నినో, లానినోల ప్రభావంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు. అడవులు తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మండుతున్న రాజధాని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే మండుతున్న ఎండలతో భగ్గుమంటోంది. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో తీవ్రత మరింత పెరుగుతుందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వడగాడ్పులు తీవ్రంగా వీయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ కేసులు, మరణాలు పెరిగే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, వైద్యారోగ్య తదితర ప్రభుత్వ శాఖలు ప్రజారోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. గతేడాది పెద్ద సంఖ్యలో వడగాడ్పుల మరణాలు దాదాపు వందేళ్లతో పోల్చితే గతేడాదే (2016) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచింది. గత వేసవిలో రాజస్థాన్లోని ఫలోడి ప్రాంతంలో ఏకంగా 51 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది వడగాడ్పుల బారినపడి దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది మరణించగా.. అందులో 400 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందినవారేనని అంచనా. అధిక ఉష్ణోగ్రత, వడగాడ్పులతో సమస్యలు ఎండలో బయటికి వెళ్లే వారు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల తీవ్రంగా అస్వస్థతకు గురవుతారు. తగిన చికిత్స, సహాయం అందకపోతే మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. వేడిగాలులకు వాహన కాలుష్యం తోడవడంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. -
భక్తులపై భానుడి ప్రతాపం
కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్న భక్తులపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత నాలుగు రోజులు ఎండలు విపరీతంగా ఉండటంతో.. భక్తులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి నుండి తమను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు విజయవాడ పుష్కర ఘాట్లలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
మ్యాంగో సమోసా!
రోహిణీ వంటకం మండే ఎండలు తెచ్చిన రోహిణీకార్తెలో కాసింత సరదాను వెతుక్కుందాం. పచ్చిమామిడికి కాసింత పచ్చిమిర్చి కలిపి సూర్యుణ్ణి ఢీ కొడదాం. ఈ సమోసాతో ఎండ నసను తరిమి కొడదాం! కావల్సినవి: మామిడికాయ ముక్కలు - కప్పు; బంగాళదుంప ముక్కలు - కప్పు పచ్చిబఠాణీలు - కప్పు, పనీర్ ముక్కలు - కప్పు, రిఫైండ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, జీలకర్ర - టీ స్పూన్, వాము - టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - కప్పు, పసుపు - అర టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్, మొక్కజొన్న పిండి - టీ స్పూన్, క్యారట్ తరుగు - కప్పు, బీన్స్ తరుగు - కప్పు, మైదా - కప్పు, ధనియాల పొడి - టీ స్పూన్, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మైదాలో వేడి నీళ్లు, ఉప్పు, వాము, నెయ్యి కలిపి, ముద్ద చేసి, పైన మూత పెట్టి పక్కన పెట్టాలి మూకుడులో జీలకర్ర, సోంపు, ధనియాలు, పల్లీలు వేయించి పక్కన పెట్టాలి కడాయిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించి, బంగాళదుంప, మామిడిముక్కలు, క్యారట్, పచ్చిబఠానీలు, బీన్స్, పనీర్, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో కొత్తిమీర, ధనియాల పొడి వేసి కొద్దిసేపు సన్నని మంట మీద ఉంచాలి పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని, పూరీలా ఒత్తుకోవాలి. చేత్తో కోన్ షేప్లో తయారుచేసుకొని, దీంట్లో ఉడికిన మిశ్రమాన్ని నింపి, నీళ్లు అద్దుకుంటూ చివర్లు సీల్ చేయాలి ఇలా అన్నీ తయారుచేసుకున్నాక కాగుతున్న నూనెలో వేసి, అన్ని వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించి, తీసి పక్కన ఉంచాలి. ఇలా తయారుచేసుకున్న సమోసాలను ఏదైనా గ్రేవీ లేదా సాస్తో సర్వ్ చేయాలి. -
విరామం విహారం
కాస్త ముందుగానే ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఈ నెలలో అయినా వేసవి సెలవులు ఆస్వాదించే అవకాశం భానుడు కల్పిస్తే సద్వినియోగం చేసుకోవాల్సిందే. రొటీన్ మూడ్ నుంచి బయటపడటానికి టూర్ వేసేయాల్సిందే....ఇలా అనుకుంటుంటే మీ వీకెండ్ టూర్ లిస్ట్లో చేర్చాల్సిన మరో డెస్టినేషన్ కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా. - హన్మకొండ కల్చరల్ చరిత్రకు సాక్ష్యం... రత్నగర్భగా పేరొందిన ఈ కోట కాకతీయుల కాలంలో సైనిక స్థావరంగా ఉండేది. కాకతీయులు, బహుమనీ సుల్తానులు, కులీ కుతుబ్షాహీలు దీనిని పాలించిన దాఖలాలున్నాయి. దీని గురించి పురాణాల్లో సైతం ప్రస్తావించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. రామయణ మహాకావ్యంలో, కాళిదాసు మేఘసందేశంలోనూ దీని ప్రస్తావన ఉందంటారు. 4 ప్రవేశ ద్వారాలు, 4 కోట గోడలతో నిర్మించిన పటిష్టమైన ఈ దుర్గంలో 3 ప్రాకారాలు ఇప్పటికీ చూడొచ్చు. కొండ మీద ఉన్న ఈ కోటకు చేరుకోవడానికి కష్టపడాల్సిందే. ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఎక్కి చూస్తే మానేరు, గోదావరిలో కలిసే అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. కనుచూపు మేర రమ్యమైన పరిసరాలు... కోట వైభవాన్ని లీలగా గుర్తు చేస్తూ నాటి వైభవం సాక్షిగా నేడో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారనే నమ్మకం తో భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటా రు. రాముడు ప్రతిష్టించిన లింగం, శ్రీసీతారాముల పాద ముద్రలుగా చెప్పే అడుగుల ముద్రలు కోట ఆవరణలో కనిపిస్తాయి. సీతమ్మ కొలను, రామపాదాలు, సీతారాముల ఆల యం, చిన్న జలపాతం.. ఇలా ఈ కోటలో విశేషాలెన్నో. అక్కడ మిగిలి ఉన్న అవశేషాలను బట్టి కొన్ని భవనా లు, బురుజులు, మసీదులు, సమాధు లు, ప్రతాపరుద్రుని కోట, అశ్వగజశాలలుగా పోల్చుకోవచ్చు. జైలు, భోజనశాల, రహస్యమార్గాలు, ఫిరంగులు కూడా కనిపిస్తాయి. ఈ కోటలో తోపుబావి, నల్లకయ్యబావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మబావి, అమ్మగారిబావి ఇలా అనేక బావులు, కొలనుల నెలవు ఈ ప్రదేశం. అనేక బురుజులు, ఆలయాలు, ప్రవేశద్వారాలున్న ఈ రామగిరి కోటకు టూరిస్టులు మాత్రమే కాకుండా స్థానికులు కూడా తరచూ పిక్నిక్కి వస్తుంటారు. వన మూలికల వేదిక ఆయుర్వేద వన మూలికలకు నిలయంగా ఈ ప్రదేశానికి పేరు. అందుకే టూరిస్టులు, స్థానికులు, సాహసికులే కాదు ఆయుర్వేద వైద్యులు, బోటనీ విద్యార్థులు కూడా తరచూ సందర్శిస్తుంటారు. అయితే చీకట్లో ఈ ప్రాంతానికి వెళ్లటం శ్రేయస్కరం కాదు. హైదరాబాద్కు 215 కి.మీ దూరంలో ఉందీ ఖిల్లా. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, మంథని దారిలో బేగంపేట గ్రామ పరిసరాల్లో ఈ కోట ఉంది. -
పట్టాలు కరిగాయి !
మండిపోతున్న ఎండలు వేడికి కేసముద్రం సమీపంలో సాగిన రైలు పట్టాలు గతేడాది కంటే 4డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు అల్లాడిపోతున్న ప్రజలు హన్మకొండ : రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయనే సామెతను మించి పోయేలా ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి నెల రోజుల ముందుగానే ఎండ ధాటికి రైలు పట్టాలు కరిగిపోతున్నాయి. గడిచిన ఇరవై రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం కేసముద్రంలో ఎండవేడికి పట్టాలు సాగిపోయూరుు. రెండు పట్టాలకు 1.90 సెంటీమీటర్ల దూరం చొప్పున ఆరు చోట్ల మెత్తబడి పట్టాకు ఉన్న ఇనుప పట్టీలు కరిగి లేచిపోయూరుు. మరికొన్ని చోట్ల మెత్తబడి గుంతలా మారి పట్టా వెడల్పు అరుుంది. దీంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలు ఆటంకం ఏర్పడింది. గతేడాదితో పోల్చితే జిల్లా వ్యాప్తంగా సగటున నాలుగైదు సెల్సియస్ డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నారుు. 36 సెల్సియస్ డిగ్రీలు దాటితే వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. అలాంటిది దాదాపు మూడు వారాలుగా 40 సెల్సియస్ డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు 45 సెల్సియస్ డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. మే నెలలో సైతం ఇదే తీరులో ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఎండల ధాటికి.. అంగన్వాఢీలా..
కేంద్రాల్లో తగ్గిన చిన్నారుల హాజరు పనివేళలు కుదించాలని నిర్వాహకుల వినతి కాజీపేట : సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఎండల ధాటికి నగరంలోని చాలా పాఠశాలలను 11.30 గంటల వరకే మూసేసి, పిల్లల్ని ఇళ్లకు పంపించేస్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారుల హాజరు శాతం సగానికి సగం పడిపోరుుంది. ఉదయం 11 గంటలు దాటితే ఆయూ కేంద్రాల్లో పిల్లల జాడ కనిపించడం లేదు. మండుటెండల్లో తమ పిల్లల్ని ఇంటి బయటికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఎండలు తగ్గేవరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పనిచేసేలా చూడాలని నిర్వాహకులు కోరుతున్నారు. తద్వారా చిన్నారుల హాజరు శాతం కొంతమేర పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేంద్రాల్లో వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా అంగన్వాడీలకు వెళ్లే చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఏప్రిల్లోనే ఇంత భారీ స్థారుులో ఉష్ణోగ్రతలుంటే.. ఇక మే, జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. దీనిపై ఐసీడీఎస్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ‘ఎండ తీవ్రతకు భయపడి పిల్లలు సక్రమంగా కేంద్రాలకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రాల పనివేళలను తగ్గించే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు’ అని వివరించారు. -
సినిమాకొచ్చిన నెమలి!
వి.కోట : అసలే ఎండలు మండిపోతున్నాయి. అడవుల్లో కూడా పచ్చదనం కరువైపోతోంది. పిట్టల్లా జనం వేసవి తాపానికి రాలుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం అన్నట్టు ఎంచక్కా ఓ నెమలి అడవి నుంచి పట్నం బాట పట్టింది. అలా..అలా..ఎగురుతూ ఓ సినిమా థియేటర్పై వాలింది. అప్పటికే ఫస్ట్షో మొదలైంది. కొత్త సినిమా కావడంతో ‘గబ్బర్సింగ్’ ఫ్యాన్స్ సందడి ఎక్కువగానే ఉంది. బయట నుంచి కొందరు నెమలిని చూసారు. ‘సినిమాకు నెమలొచ్చిందిరోయ్’ అంటూ కేకలు వేసి హడావుడి చేయడంతో అది కాస్తా బెదిరిపోయింది. అక్కడి నుంచి కేబిన్రూంలోకి ప్రవేశించింది. ఐదారు నిమిషాలు అటూఇటూ అక్కడే తిరిగిన నెమలి థియేటర్ సిబ్బంది కేబిన్లోకి రూంలోకి రావడంతో మళ్లీ బెదిరిపోయింది. ఈ సినిమాకో దండం సామీ అనే లెవెల్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి పరుగులు తీసి ఓ రూమ్లోకి వెళ్లింది. దీంతో థియేటర్ సిబ్బంది ఆ రూమ్కు గడి పెట్టి, అటవీ సిబ్బందికి సమాచారం చేరవేశారు. సినిమాకు శుభం కార్డు పడేవేళకు నెమలి గురించి తెలియడంతో ప్రేక్షకులు సైతం నెమలిని చూసేందుకు ఆసక్తి చూపారు. సెకండ్షోకు వచ్చిన వారు ఇది ‘సర్దార్’ ఫ్యాన్ ఏమోనంటూ సరదాగా జోకులేసుకున్నారు. శనివారం రాత్రి ఈ సంఘటన వి.కోటలో చోటుచేసుకుంది. ఇక, ఆదివారం ఉదయం థియేటర్ వద్ద నెమలిని స్వాధీనం చేసుకున్న అటవీ సిబ్బంది మళ్లీ దానిని అటవీ ప్రాంతంలో వదలడం ఆలస్యం.. బతుకుజీవుడా!.. అంటూ మళ్లీ అడవి బాట పట్టింది! -
సూర్య ప్రతాపం
వడదెబ్బకు 10 మంది మృతి రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయాందోళన చెందుతున్న ప్రజలు ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు భగ్గుమంటున్నారుు. వేడిమితో పాటు వడగాల్పులు భరించలేక ప్రజల ప్రాణాలు హరీ అంటున్నారుు. చిన్నా, పెద్ద తేడా లేకుండా వడదెబ్బకు బలవుతున్నారు. జిల్లాలో గురువారం ఒక్కరోజే వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొడకండ్ల : మండలంలోని పెద్దవంగర గ్రామానికి చెందిన ఈదురు ఎల్లమ్మ(58) ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఎల్లమ్మకు ఇద్దరు కుమారులున్నారు. ఆత్మకూరు : మండలంలోని ముస్త్యాలపల్లికి చెందిన కొత్తపెల్లి చంద్రమ్మ (55) గురువారం కూలీ పనులకు వెళ్లి వచ్చి అస్వస్థతకు గురైంది. కు టుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెం దింది. చంద్రమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జఫర్గఢ్ : మండలంలోని తిడుగు గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటేశ్వర్లు(32) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండు రోజుల క్రి తం పనికి వెళ్లిన వెంకటేశ్వర్లు ఎండ తీవ్రతతో అస్వస్థకు గురయ్యూడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తిరిగి ఇంటికి వచ్చాక మళ్లీ అస్వస్థతకు గురై మృతిచెందాడు. నిరుపేద అరుున వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు అన్నెబోయిన భిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు చిట్టిమళ్ల కృష్ణమూర్తి తదితరులు పరామర్శించారు. కాశిబుగ్గలో సెంట్రింగ్ కార్మికుడు.. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ బీఎన్ రావు కాలనీకి చెందిన సిరిపెల్లి వీరస్వామి(52) గత 15 ఏళ్లుగా సెంట్రింగ్ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం దేశాయిపేటలోని ఓ ఇంటి నిర్మాణంలో కూలి పని చేస్తూ వడదెబ్బకు గురయ్యూడు. ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని భార్య మార్తకు చెప్పాడు. గురువారం విరేచనాలు, వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగానే మృతి చెందినట్లు మార్త బోరున విలపించింది. స్థానిక కార్పోరేటర్ బయ్యస్వామి వీరస్వామి కుటుంబసభ్యులను ఓదార్చి దహనసంస్కరాల ఖర్చులు ఇచ్చారు. మృతుడి కుటుంబ పరిస్థితిని కొండా దంపతుల దృష్టికి తీసుకెళ్లి, సాయం చేయిస్తానని తెలిపారు. స్థానిక పెద్దలు కట్కూరి రాజు, కండె పోషయ్య, మహేందర్, ఆరెపెల్లి రవి, పెండ్యాల కొమురయ్య, బొచ్చుమహేష్ తదితరులు సంతాపం తెలిపారు. మంగపేటలో ఇద్దరు.. మండలంలోని కోమటిపల్లికి చెందిన బత్తిని వెంకన్న(42) కూలీ పనికి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యూడు. వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సబ్యులు మంగపేట పీహెచ్సీకి తరలిస్తుండగానే మృతి చెందాడు. వెంకన్నకు భార్య రజిత, కుమారుడు రాకేష్, కుమార్తె అనూష ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అనంతుల సాంబయ్య అనే టీఆర్ఎస్ నాయకుడి తల్లి సరోజన(80) కూడా వడదెబ్బతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఖానాపురం : వుండల కేంద్రానికి చెందిన గట్టి చిన్న రావుయ్యు(60) వడదెబ్బకు గురై వాం తులు, విరేచనాలు చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఇంటి వద్దనే చికిత్స చేరుుస్తుండగా గురువారం వుృతి చెందాడు. వుృతునికి భార్య లచ్చవ్ము, వుుగ్గురు కువూర్తెలు, ఇద్దరు కువూరులు ఉన్నారు. కురవిలో ఇద్దరు.. మండలంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతమల్ల స్వామి(55), నల్లెల్ల గ్రామానికి చెందిన కల్లూరి గోవిందమ్మ(45) వడదెబ్బ తాళలేక ప్రాణాలొదిలారు. వీరి మృతికి ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు సంతా పం తెలిపారు. కరీమాబాద్ : నగరంలోని కరీమాబాద్ నానమియాతోటలో కూలీ పనులు చేసుకుని జీవించే వనం విజయ(45) గురువారం వడదెబ్బ తట్టుకోలేక మృతి చెందింది. కార్పోరేటర్ మేడిది రజిత విజయ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక నాయకులు మేడిది మధు, చారి, సాబీర్ సంతాపం తెలిపారు. -
మండే ఎండ
ఆరేళ్ల తరవాత రికార్డు స్థాయి ఉష్ణోగ్రత 41.4 డిగ్రీలుగా నమోదు సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. ఆరేళ్ల తరువాత సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్లో 2010 ఏప్రిల్ 16న42.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది ఏప్రిల్ తొలివారంలోనే (సోమవారం) 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటి వరకు నమోదైనఅత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 26.7 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ 24 శాతానికి పడిపోయింది. మధ్యాహ్న వేళల్లో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు ఎండ తీవ్రతకు అవస్థలు పడ్డారు. చిన్నారులు, వృద్ధులు, రోగుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
జల శోకం
అడుగంటిన భూగర్భ జలాలు పని చేయని బోరు బావులు గ్రేటర్, శివార్లలో నీటి కష్టాలు మహా నగరాన్ని ఓ వైపు ఎండలు వణికిస్తున్నాయి. మరోవైపు నీరు కన్నీరు తెప్పిస్తోంది. భూగర్భ జలమట్టాలు అడుగంటడంతో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. బిందెడు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పిల్లా పాపలతో కలసి నీటి కోసం జనం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. సిటీబ్యూరో: భానుడి భగభగలతో భూగర్భ జలమట్టాలు దారుణం గా పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలోని బోరు బావులు చుక్క నీరు లేక బావురుమంటున్నాయి. గ త ఏడాది మార్చి చివరికి సగటున 10.72 మీటర్ల లోతున నీటి చుక్క జాడ లభించగా.. 2016 మార్చి నాటికి 17.86 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఫలితంగా శివారు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్ నీటి ప్లాంట్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మండలాల్లో దుర్భరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మండుటెండలకు తోడు నీటిని ఒడిసి పట్టేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో వివిధ మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. ప్రధాన నగరంలోని ఆసిఫ్నగర్లో 3.92 మీటర్లు, బండ్లగూడలో 0.70, ఖైరతాబాద్లో 2.35, బహదూర్పురాలో 1.25 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయాయి. శివార్లలోని హయత్నగర్లో 1.79 మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 0.60, మహేశ్వరంలో 4.50, మేడ్చల్లో 4.61, శామీర్పేట్లో 0.55, ఉప్పల్లో 2.50, బాలానగర్లో 0.50, రాజేంద్రనగర్లో 1.15, శంషాబాద్లో 1.65 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోయినట్లు భూగర్భ జల శాఖ తాజా నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ బోరు బావులు వట్టిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల నీటి దందా జోరందుకుంది. నిజాంపేట్, మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బోడుప్పల్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో ..ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్కు డిమాండ్ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వారికి ఇంటి అద్దెతో సమానంగా నెలకు నీటికి ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీని అదుపు చేయడంలో జలమండలి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు విఫలమవుతుండడం గమనార్హం. వేసవిలోనే ఇంకుడు గుంతల నిర్మాణాలతో సత్ఫలితాలు ఇంకుడు గుంత ఇలా ఉండాలి మధ్య తరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు ఉన్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీసి... అందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజు రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు గుంతలో కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జి సులువవుతుందని, బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఇల్లు, కార్యాలయం విస్తీర్ణాన్ని బట్టి దీని సైజు పెరుగుతుందని తెలిపారు. -
ఇల్లే ఓ బ్యూటీ క్లినిక్
ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఎంత ఎండలు ఉన్నా, బయటకి వెళ్లనిదే ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటితో సహా ఇతర పనులు జరగవు కదా! ఎండలోకి వెళ్లేముందు ముఖానికి, చేతులకు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టం. అయితే బోలెడంత ఖరీదు పెట్టి సన్స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది. కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొబ్బరిపాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకుని, ఆరాక కడుక్కున్నా మంచి ఫలితం ఉంటుంది. కేవలం ముఖానికి రాసుకోవడమే కాదు; కొబ్బరినీళ్లు తాగడం వల్ల కూడా చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది. అదేవిధంగా ఒక్క ఎండాకాలంలోనే కాదు; చాలామందికి కళ్ల కింద నల్లటి వలయాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దానికి ఫ్రిజ్లోంచి అప్పుడే తీసిన చల్లటి బంగాళదుంప లేదా కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అందులోని బ్లీచింగ్ ఏజెంట్ ఆ మచ్చలను మటుమాయం చేస్తుంది. -
సన్డే...
పెరిగిన ఎండలు 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు సిటీబ్యూరో: నగరంలో ఎండలు భగ్గుమంటున్నాయి. పగటిపూట నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదివారం నగరంలో గరిష్టంగా 41.3 డిగ్రీలు, కనిష్టంగా 26.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి, ఉక్కపోత తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. రోడ్లవెంట నివసించే యాచకులు, అనాథలు, ఇతర ప్రయాణికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎండల తీవ్రత అతిగా ఉంటే...అతినీల లోహిత కిరణాల వల్ల ముఖ సౌందర్యం దెబ్బతినడంతో పాటు చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు పగటిపూట బయటికి వెళ్లక పోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఎండలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఆయా రంగాల నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు..మజ్జిగ... వేసవిలో రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తాగాలి. పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోతే వడదెబ్బకు గురవుతారు. వేడికి తట్టుకోలేక తాగే కూల్డ్రింక్స్ ఆరోగ్యాన్ని హరిస్తాయి. వీటిలోని ఫాస్పేట్ పదార్థంతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. దాహం వేయకపోయినా నీళ్లు కొంచెం కొంచెం తాగడం వల్ల డీహైడ్రేషన్ భారీ నుంచి కాపాడుకోవచ్చు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయ రసం వంటివి మంచినీళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తాయి. - డాక్టర్ సమి, అపోలో ఆస్పత్రి, డీఆర్డీఓ ఎండలో ఆడనివ్వకూడదు.. చిన్నారుల శరీరంలో 50 శాతం నీరే ఉంటుంది. ఎండ దెబ్బకు నీటి శాతం తగ్గడం వల్ల చిన్నారులు వడదెబ్బకు గురవుతారు. త ద్వారా తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు రావచ్చు. వేసవి సెలవుల కారణంగా ఆటపాటలు ఎక్కువవడం సహ జం. దీనికి ఎండ తోడవడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు. నీటి పరిమాణం ఎక్కువుండే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి వి అందించాలి. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండేలా చూడాలి. బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఆహారంగా ఆమ్లెట్కు బదులు ఉడకబెట్టిన గుడ్డు, కోల్డ్ మిల్క్ వంటివి అందించాలి. - డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్ కుక్కలకు దూరంగా ఉండాలి పగటి ఉష్ణోగ్రతలు వీధి కుక్కలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. సరిపడు ఆహారం, మంచి నీరులేమితో పాటు మండుతున్న ఎండలు వీటికి పిచ్చెక్కిస్తున్నాయి. కుక్కలకు వేట సహజ లక్షణం. ఈ లక్షణమే వాటిని చిన్నారులు, వాహనదారులపై ఉసికొల్పుతుంది. ఇలా ఫీవర్ ఆస్పత్రిలో రోజు సగటున 35 కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. కాబట్టి కుక్కలకు దూరంగా ఉండాలి. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను కుక్కలకు దూరంగా ఉంచాలి. - డాక్టర్ గోవర్థన్, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి మసాల ఫుడ్డు వద్దు పాలు, పాల పదార్థాలతో తయారు చేసిన లస్సీలు కాకుండా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ద్రవపదార్థాలు అధికం గా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, మామిడి పండ్లు, ముంజలు వంటివి తీసుకోవాలి. రోడ్ల వెంట ఐస్తో తయారు చేసిన రంగు నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లు తాగాలి. మసాలాలు ఉన్న ఆహారం వద్దు. తేలికగా జీర్ణం అయ్యేవి తీసుకోవాలి. వడదెబ్బ తగిలి సొమ్మ సిల్లిన వ్యక్తులను కూర్చో బెట్టకూడదు. నీడకు తరలించి ఏదైనా నునుపైన బల్లపై కానీ మంచంపై కానీ పడుకోబెట్టాలి. నూలుతో తయారు చేసిన తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. స్పృహలోకి వచ్చిన తర్వాత చల్లటి మంచి నీరు, సోడా, కోబ్బరి నీళ్లు, మజ్జిగ తాగించాలి. - డాక్టర్ రవిశంకర్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సన్షైన్ స్కిన్ గ్లో తగ్గకుండా... చెమటపొక్కుల్ని గోళ్లతో గిల్లడం వంటివి చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎండలకు సెగ గడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ. యాంటి బ్యాక్టీరియల్ సోప్తో వీటిని శుభ్రం చేసుకోవాలి. గాఢమైన రంగులున్న దుస్తులు కాకుండా తేలి కైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. పట్టినట్టుండే దుసు ్తలు కాకుండా వదులైన పలుచని దుస్తులు వేసుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు తలకు క్యాప్ అలవాటు చేసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం వేళలో చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇంటి తలుపులు, కిటికీలకు గోనె సంచులను అమర్చి, వాటిని నీటితో తడపాలి. - ప్రొఫెసర్ మన్మోహన్, చర్మవైద్య నిపుణుడు, ఉస్మానియా ఆస్పత్రి సర్వేంద్రియానాం...‘నయనం’... మండుతున్న ఎండలు కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డీహైడ్రేషన్ వల్ల కళ్లు ఎర్రబడి, మంట పుట్టిస్తాయి. పగలు నేరుగా సూర్యుని వైపు చూడకూడదు. వైద్యుడి సూచన మేరకు కళ్లకు ఎలాంటి హానీ చేయని కంటి అద్దాలను ఎంపిక చేసుకోవాలి. ఏవీ పడితే అవి కాకుండా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కళ్లజోళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఫొటోగ్రే, ఫొటో థింక్, ఫొటో బ్రౌన్ లెన్స్ అద్దాలను వాడటం ఉత్తమం. - డాక్టర్ రవీందర్గౌడ్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
ఎండప్రచండం
ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మార్చి దాటకుండానే మండిపోతున్నాడు సూర్యుడు. ఈ నెలలో ఉండాల్సిన దాని కంటే మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెండాడే ఎండలతీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. మరింత తీవ్రతరమవుతాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. ఈ పరిస్థితుల్లో వడదెబ్బకు చాలా తేలికగా గురయ్యే అవకాశం ఉంది. అయితే వడదెబ్బపై అవగాహన ఉంటే ఆ ఉష్ణోగ్రతా ఉత్పాతాన్ని అంతే తేలిగ్గా తప్పించుకునే అవకాశం ఉంది. వడదెబ్బను కాచుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. నీడ పట్టునే ఉన్నా వడదెబ్బ రిస్క్! ఒకవేళ మనం నీడపట్టునే ఉన్నా లేదా ఫ్యాన్ గాలి తగులుతూనే ఉన్నా... మన పరిసరాల్లోని తీవ్రమైన ఉష్ణోగ్రతతో వల్ల ఆ వేడిగాలి వల్ల కూడా వడదెబ్బ తగలవచ్చు. సాధారణంగా వడగాడ్పులు (హీట్ వేవ్స్) ఎక్కువగా ఉన్న సమయంలో దీనికి గురవుతుంటారు. దీన్ని నాన్ ఎగ్జర్షనల్ హీట్స్ట్రోక్ లేదా క్లాసిక్ హీట్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఇంటిలోనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వయోవృద్ధులు, చిన్నపిల్లలు దీనికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఏసీ సౌకర్యాలు లేని వాళ్లకు, సరిగా గాలి సోకని ప్రదేశాల్లో (సరైన వెంటిలేషన్ లేని చోట) ఉండేవారికీ ఇది తగిలే అవకాశం ఎక్కువ. వడదెబ్బను గుర్తించండిలా... శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్హీట్ (40.6 సెంటీగ్రేడ్) కంటే ఎక్కువ పెరుగుతుంది. ముఖంలోకి రక్తం చిమ్ముకొచ్చినట్లుగా ఎర్రగా మారుతుంది (ఫ్లషింగ్) చాలా వేగంగా శ్వాస తీసుకుంటుంటారు. అయోమయం కొందరిలో ఫిట్స్ చాలా ఎక్కువ జ్వరం, స్పృహలో లేకపోవడం / అయోమయం (కన్ఫ్యూజన్); కుదురుగా ఉండలేకపోవడం; భ్రాంతులు, చికాకు, కోపం వంటి భావోద్వేగాలు కనిపిస్తాయి. ఇక చివరగా కోమాలోకి వెళ్తారు. ఇతర కాంప్లికేషన్లు... మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్)బీపీ తగ్గడం శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తస్రావం (ఉదాహరణకు ముక్కురంధ్రాల వంటి భాగాల నుంచి) అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్) ఇలాంటి అన్ని పరిస్థితి ఏదైనా కనిపిస్తే వెంటనే బాధితులను ఆసుపత్రిలో చేర్చాలి. ఎవరిలో ఎక్కువ న్నపిల్లలు, వృద్ధులు దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వారు (క్రానిక్ పేషెంట్స్) ఆరుబయట పనిచేయాల్సి ఉన్న పోలీసు వంటి వృత్తుల్లో ఉన్నవారు {Mీడాకారులు స్థూలకాయులు మద్యం తీసుకునేవాళ్లు, డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్లు మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారు... ఉదాహరణకు కోకైన్, యాంఫిటమిన్స్, ఎల్ఎస్డీ, ఎఫిడ్రిన్ వంటివి తీసుకునేవాళ్లు. కొన్ని మందులు వాడే వారు... ఉదాహరణకు దాహాన్ని తగ్గించే హ్యాలోపెరిడాల్ మందులు తీసుకునేవారిలో... చెమటను తగ్గించే మందులైన యాంటీహిస్టమైన్స్, యాంటీకోలినెర్జిక్, ఫీనోథయజైన్స్, బీటాబ్లాకర్స్ తీసుకునేవాళ్లలో హార్ట్ పేషెంట్స్ వాడే డైయూరెటిక్స్ మందులు (మూత్రం ఎక్కువగా పోయేలా చేసే మందులు). పొడి చర్మం ఉన్నవాళ్లు, వేడి చర్మం ఉన్నవాళ్లు స్వేదరంధ్రాలు తక్కువగా ఉండేవారిలో వడదెబ్బ తగిలేందుకు అవకాశాలు ఎక్కువ. నివారణ... సాధ్యమైనంత మట్టుకు నీడలోనే ఉండాలి. బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉదయం 10 గంటలకు ముందుగాని... సాయంత్రం చల్లబడ్డ తర్వాత గాని బయటిపనులు చూసుకోవాలి. ఇంటి కిటికీలను తెరచి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అయితే వేడిగాలి రాకుండా, గది చల్లగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎండకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకువెళ్లడం, వెడల్పు అంచులున్న హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి. శరీరం లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు వేసిన ద్రవాలు ఇవ్వాలి. చెమటను గ్రహించే, చల్లగా ఉంచే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. వడదెబ్బకు దోహదం చేసే మందులు డాక్టర్ సలహామేరకు మోతాదు తగ్గించడంగాని లేదా ఆపేయడంగాని చేయాలి. వడదెబ్బ నివారణ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. ఈ వేసవిలో శీతలపానీయాలు (ఏరేటెడ్ కూల్డ్రింక్స్) మంచివి కాదు. వాటికి బదులు కొబ్బరిబొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరం కోల్పోయే లవణాలను భర్తీ చేయవచ్చు. వడదెబ్బ తగిలిన వాళ్లలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లేకుండా పెరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో చూద్దాం. మన దేహం నార్మల్ శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారన్హీట్. ఆ ఉష్ణోగ్రత వద్ద మన జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉండేలా హైపోథెలామస్ అనే కీలకభాగం చూస్తుంటుంది. ఎంత ఎండలోనైనా మన శరీర ఉష్ణోగ్రత నార్మల్గానే ఉంటుంది. మహా అయితే అది 99.9 ఫారెన్హీట్ వరకు పెరిగి, మళ్లీ నీడకు రాగానే నార్మల్కు వచ్చేస్తుంది. అయితే ఇలా దేహం మళ్లీ శరీరం ఉష్ణోగ్రతను నార్మల్కు తీసుకురాలేని పరిస్థితి వస్తే దాన్ని ‘వడదెబ్బ’గా పరిగణిస్తారు. వడదెబ్బ సాధారణ లక్షణాలు... చర్మం స్వేదాన్ని ఇక స్రవించలేని పరిస్థితికి రావడం. తలనొప్పి వికారం, కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) ముఖ్యంగా పిక్కలు పట్టేయడం (క్రాంప్స్ ఇన్ కాఫ్ మజిల్స్) వాంతులు కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వడదెబ్బ తీవ్రతను సరిగా అంచనా వేయడంలో లోపంగాని, లేదా గుర్తించక సకాలంలో ఆసుపత్రికి తరలించడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. కీలక అవయవాలపై దుష్ర్పభావాలు... వడదెబ్బ ప్రభావం అన్ని కీలకమైన అవయవాలపై పడుతుంది. గుండె, మూత్రపిండాలు, కండరాలు, కాలేయం, రక్తం గడ్డకట్టే వ్యవస్థ (కోయాగ్యులేషన్ సిస్టమ్)... ఇలా వీటన్నింటిపై వడదెబ్బ దుష్ర్పభావాలు ఉంటాయి. అయితే సరైన సమయంలో వడదెబ్బ లక్షణాలను గుర్తిస్తే ఆ దుష్ర్పభావాలను నివారించవచ్చు. చికిత్స... వడదెబ్బ తగిలినప్పుడు అత్యవసరంగా వైద్యచికిత్స అందించాలి. దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిస్తారు. అలాంటి సమయాల్లో చికిత్స పరంగా అనుసరించే ప్రక్రియలివి... శరీరం వెంటనే చల్లబడేలా చేస్తారు. ఐస్ వాటర్ టబ్లో తల, చేతులు, మోకాళ్ల కిందభాగం ఉండేలా చేయాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారిన్హీట్కు తగ్గిన వెంటనే ఇలా నేరుగా ఐస్తో చల్లబరిచే ప్రక్రియను ఆపాలి. అయితే ప్రతి 5 నిమిషాలకు ఓసారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ ఉండాలి.శరీరానికి చల్లటి గాలి తగిలేలా విసనకర్రలతో విసరడం వంటివి చేయాలి.ఐస్ప్యాక్ ఉపయోగించాలి. ఐస్ టబ్ లేకపోతే ఐస్ప్యాక్స్ను నుదుటిమీద, మెడ, చంకల్లో, గజ్జల్లో పెట్టవచ్చు. మామూలుగా ఐస్ వాడటం వంటి సర్ఫేస్ కూలింగ్ అని పిలిచే ప్రక్రియలతో ప్రయోజనం లేనప్పుడు, పేషెంట్ అపస్మారక స్థితిలో ఉండి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు రోగిని ఐసీయులో చేర్చి ‘ఇంటర్నల్ కూలింగ్ మెథడ్స్’ అవలంబిస్తారు. ఉదాహరణకు ... పొట్టలోకి చల్లటి సెలైన్ (గ్యాస్ట్రిక్ లవాజ్) పంపుతారు. అలాగే ఉదరకుహరం (పెరిటోనియల్ క్యావిటీ)లోకీ చల్లటి సెలైన్ పంపి రక్తాన్ని చల్లబరుస్తారు. దీన్ని పెరిటోనియల్ లవాజ్ అంటారు. డాక్టర్ గోవర్ధన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఎండప్రచండం -
మండుతున్న మన్యం
చింతపల్లిలో 35 డిగ్రీలు నమోదు చింతపల్లి: మన్యంలో ఎండలు మండుతున్నాయి. మైదాన ప్రాంతలకు దీటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో గిరిజనులు విలవిలలాడి పోతున్నారు. సోమ, మంగళవారాలు చింతపల్లిలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చల్లని వాతావరణానికి మారుపేరైన చింతపల్లి ప్రాంతంలో ఈ ఏడాది మర్చిలోనే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే మన్యంలో వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో అడపా దడపా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఎప్పుడో గాని 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాదు. మార్చిలో కూడా రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా మారిపోతుంది. ఈ ఏడాది వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. పగలు 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం రోడ్లపై తిరగలేని పరిస్థితి. సాయంత్రం 6 గంటలైతే గాని వాతావరణం చల్లబడడంలేదు. ఫ్యాన్లు తిరగనిదే నిద్ర పట్టడంలేదు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయోనని ఈ ప్రాంత గిరిజనులు బెంబేలెత్తి పోతున్నారు. హుద్హుద్ తుఫాన్ కారణంగా భారీ ఎత్తున చెట్లు నేల కూలడం వల్ల కూడా వాతావరణంలో భారీ మార్పులకు కారణమయిందని శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ తెలిపారు. శీతాల పానియాల కన్నా మజ్జిగ ఎక్కువగా తాగితే మంచిదని లంబసింగి వైద్యాధికారి కొప్పుల రవి సూచించారు. -
అప్పుడే షాక్!
గ్రేటర్లో మండుతున్న ఎండలు రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 51.88 మిలియన్ యూనిట్లు దాటిన వైనం లోడ్ రిలీఫ్ పేరిట కోతలు వినియోగదారుల్లో ఆందోళన సిటీబ్యూరో: మహా నగరంలో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సోమవారం గరిష్టంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. ఈ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. మార్చి మొదటి వారంలో 42 మిలియన్ యూనిట్ల లోపే ఉండగా... ప్రస్తుతం (శనివారం) రికార్డు స్థాయిలో 51.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. రానున్న వేసవిలో గ్రేటర్ విద్యుత్ డిమాండ్ 58 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఎల్ఆర్ పేరుతో ‘కోత’లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు సరిపడే విద్యుత్ ఉన్నా...పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండటం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరుగుతోంది. వీటివల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే ప్రమాదం ఉంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ప్రతి రెండు గంటలకోసారి 15 నిమిషాల పాటు అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట కోత విధిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే... ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గరిష్టం..40.3 డిగ్రీలు.. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం గరిష్టంగా 40.3, కనిష్టంగా 23.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొందరు వాహనదారులు, పాదచారులు సొమ్మసిల్లారు. లస్సీ, కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదదీరారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. ఆరేళ్ల తరవాత నగరంలో ఈ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఎండకు బయటికి వెళ్లేటప్పుడు కళ్లు, చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు ఎండ దెబ్బకు గురికాకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆందోళన అవసరం లేదు గత ఏడాది మార్చి 2న గ్రేటర్లో 38.06 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తే... ప్రస్తుత మార్చి 2న 46.38 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ఏడాది 2,086 మెగవాట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం 2,240 మెగవాట్లకు చేరింది. పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు, డిమాండ్కు దీటుగా రూ.240 కోట్లు ఖర్చుతో సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిమాండ్ను తట్టుకునే విధంగా సరఫరా వ్యవస్థను మెరుగుపరిచాం. -శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ -
వాటర్ కూలర్ వ్యాధి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’!
మెడిక్షనరీ ఎండలు బాగా ముదురుతున్నాయి. అప్పటివరకూ మూల పడి ఉన్న వాటర్ కూలర్స్ తీసి వాడబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఇది కాస్త చదవండి. వాటర్ కూలర్లోని అడుగు భాగంలో నీళ్లు ఉన్నా... కాసేపు వాటర్ కూలర్ను బయట పెట్టి ఆన్ చేయకుండా ఉన్నా ఆ మెష్లోని ఒక రకం బ్యాక్టీరియా వల్ల ఈ వాటర్ కూలర్లో దాగి ఉండే లీజియొనెల్లా అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వాటర్ కూలర్ నిమోనియా అని పరిగణించే ‘లీజియొన్నేరిస్ డిసీజ్’ అని పేరున్న ఒక విధమైన నిమోనియా రావచ్చు. అప్పటికే ఆస్తమా వంటి వ్యాధిగస్తులైతే ఈ లీజియొనెల్లా బ్యాక్టీరియాతో మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే పాత నీరు అంతా బయటకు పోయేలా, మెష్ భాగంలో ఉన్న తడిక వంటి భాగంలోని బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్లేలా కాసేపు కూలర్ను ఆరుబయటే ఆన్ చేసి ఉంచాలి. కూలర్లో పాత నీరు... ఒక్క చుక్క కూడా లేకుండా డ్రై అయిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత తాజా నీళ్లు (ఫ్రెష్ వాటర్) పోసి అప్పుడు మాత్రమే వాడుకోవాలి. -
బిడ్డ తల ఫ్లాట్?.. ఆందోళన అక్కర్లేదు!
హోమియో కౌన్సెలింగ్ రాబోయే ఎండాకాలంలో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని చాలా వార్తలు వింటున్నాం. ఈ అధిక భానుడి తాపాన్ని తట్టుకొని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. - ప్రసన్నకుమారి, వరంగల్ భానుడి తాపం అధికం కావడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఏ వయస్సు వారికైనా వడదెబ్బ తగలవచ్చు. అయితే ఇది చిన్నపిల్లలను, వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీనిబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఆ చెమటపట్టమే ఎక్కువ సమయం కొనసాగితే నీరు, లవణాలు కోల్పోతారు. ఇలా కోల్పోయిన నీరు, లవణాలు తిరిగి భర్తీ కానప్పుడు శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఈ సమయంలో శరీర కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించుకుంటాయి. దీనివలన రక్తం పరిమాణం తగ్గి, శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ మందగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. లక్షణాలు: ఎండదెబ్బకు గల లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. శరీరం శీతలీకరణ వ్యవ్థ కోల్పోవడం వలన శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారెన్హీట్ పైగా పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు: నీరు, ఇతర ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వదులుగా ఉండే, పల్చని, లేతవర్ణం దుస్తులు వేసుకోవాలి. కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. మద్యపానం, కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్రవిసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్కి గురిచేస్తాయి. కాబటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. ఒంటికి చల్లగాలి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు 13 నెలలు. పాపకు తల ఎడమవైపున ఫ్లాట్గా ఉంది. పరిశీలించి చూస్తే ఒకవైపున సొట్టపడ్డట్లుగా అనిపిస్తోంది. దీనికి చికిత్స అవసరమా? - సంధ్య, అనంతపురం మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తే... మీ పాపకు పొజిషనల్ సెఫాలీ అనే కండిషన్ ఉందని అనిపిస్తోంది. దీన్నే ఫ్లాటెన్డ్ హెడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. పిల్లలను ఎప్పుడూ ఒకే స్థితిలో పడుకోబెట్టినప్పుడు ఇది కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాప గర్భంలో ఉన్నప్పుడు ఇది మొదలై ఉండవచ్చు. ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. దీన్నే క్రేనియో సినోస్టాసిస్ అంటారు. అయితే ఇది కాస్తంత తీవ్రమైన సమస్య. పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. అంటే కాలక్రమంలో తలలోని సొట్టలు కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ పిల్లల్లో కూడా సాధారణ పిల్లల్లాగానే తెలివితేటలుంటాయి. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రిషియన్కు చూపించండి. ఇది పొజిషనల్ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి. కేవలం తల ఒకవైపు ఫ్లాట్గా కనిపిస్తుండటమే సమస్య అయితే దాని గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మా బాబు వయసు 25 ఏళ్లు. బరువు 75 కేజీలు. తనకు ఈమధ్యే గుండెలో నొప్పి వచ్చింది. డాక్టర్ను కలిస్తే ముందుగా బరువు తగ్గమని చెప్పారు. లేదంటే గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయని అన్నారు. ఇంత చిన్న వయసులో గుండెజబ్బులు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - కమల, విజయవాడ గుండెజబ్బులు ఒక వయసు దానిటి తర్వాత వస్తాయనేది గతంలో అభిప్రాయం. గుండెజబ్బుల విషయంలో ఇప్పుడు ఎదురవుతున్న అనుభవాలు, పెరుగుతున్న కేసులు గత అభిప్రాయాలను మారేలా చేస్తున్నాయి. పాశ్చాత్యులతో పోలిస్తే మన దేశవాసుల్లో స్వతహాగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికితోడు మారుతున్న ఆహారపు అలవాట్లు... అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండటం కోసం ఉపయోగించే మార్జరిన్ వంటి నూనెలు, కొవ్వులు ఉండే ఆహారపదార్థాలను వాడటంతో పాటు శరీరంలో కదలికలు లేని తరహా వృత్తులు పెరగడం, శరీరానికి అవసరమైన కొద్దిపాటి కదలికలు కూడా లేకపోవడం వల్ల చిన్నవయసులోనే గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. నివారణ ఇలా... వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేనివాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాల పాటు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది చక్కెర, రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా వాటిని అదుపులో పెట్టుకోవాలి పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే హైబీపీ ఉన్నవారు ఆహార నియమాలు తప్పక పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్టెన్షన్ (డ్యాష్) అంటారు. అవి... ఆహారంలో ఉప్పుతో పాటు బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్ తగ్గించాలి తాజా పండ్లు, పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి వేటమాంసం, కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామం చేయవచ్చు రోజూ కనీసం 6- 8 గంటలు నిద్రపోవాలి. నడుము కొలత కూడా గుండెజబ్బులకు ఒక సూచనే. పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉండే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి. పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం ఉన్నవారు వారు ఒకసారి కార్డియాలజిస్ట్ను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిశ్చింతగా ఉండవచ్చు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
ప్రతాపం
మండుతున్న ఉద్యాననగరి 35.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కలబుర్గిలో 40డిగ్రీలు బెంగళూరు: సూర్యతాపం రాష్ట్రాన్ని వేడెక్కిస్తోంది. మార్చి రాకనే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యాననగరిగా పేరుగాంచిన బెంగళూరుతో సహా పలు పట్టణాల్లో గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. బెంగళూరులో సాధారణ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్ కాగా, గత సోమవారం ఉష్ణోగ్రతలో నాలుగుడిగ్రీల పెరుగుదల నమోదు చేసుకుని 35.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి గత పదేళ్లలో ఇదే అతి ఎక్కువ పగటి ఉష్ణోగ్రత. అంతకు ముందు 2005లో ఫిబ్రవరి నెలలో 35.9 డిగ్రీల సెన్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడమే ఇప్పటి వరకూ ఉన్న రికార్డు. ఒక్క బెంగళూరే కాక రాష్ట్రంలోని పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బిసిలునాడు (వేసవి ప్రాంతం)గా పేరుగాంచిన కలబుర్గీలోలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు కాగా ప్రస్తుతం నలభై డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత. అంతకు ముందు అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత రెండేళ్లక్రితం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయమై భారత వాతావరణ శాఖ బెంగళూరు విభాగం అధిపతి గీతా అగ్నిహోత్రి మాట్లాడుతూ.... ‘ఖరీఫ్, రబీల్లో సరైన వర్షాలు కురవక పోవడంతో వాతావరణంలో తేమశాతం దారుణంగా పడిపోయింది. దీంతో వేసవి ప్రారంభంలోనే ఇటువంటి ఎండలను చవిచూడాల్సి వస్తోంది. రానున్న కాలంలో ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉంది. మా అంచనా ప్రకారం 2000 ఏడాదికి ముందు ఉన్న ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు.’ అని అభిప్రాయపడ్డారు. -
పగలు ఎండ.. రాత్రి చలి
మధ్యాహ్నం చుర్రుమంటోంది రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ఏజెన్సీలో వింత వాతావరణం చింతపల్లి: చల్లని వాతావరణానికి నిలయమైన మన్యంలో వింతవాతావరణం చోటుచేసుకుంది. వేసవికి ముందే మధ్యాహ్నంపూట సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రానున్న రోజుల్లో ఏజెన్సీలో ఎండలు మైదానానికి ఏమాత్రం తీసిపోవని ఇక్కడి పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హుద్హుద్ కారణంగా మన్యంలో వేలాది వృక్షాలు కూలిపోవడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశాలనున్నాయని చెబుతున్నారు. కాగా ఇప్పటికీ ఇక్కడ రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి వణికిస్తోంది. బుధవారం చింతపల్లిలో 8 డిగ్రీలు, లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో ఏటా మహాశివరాత్రి ముగిసే వరకు తక్కువ ఉష్ణోగ్రతులు నమోదవుతుంటాయి. ఆంధ్ర కశ్మీర్గా గుర్తింపు పొందిన లంబసింగిలో శీతాకాలంలో కచ్చితంగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ ఏడాది మాత్రం అక్కడ కూడా మూడుకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. హుద్హుద్ కారణంగానే ఈ పరిస్థితి అని శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ చెబుతున్నారు. -
అప్పుడే షాక్!
→ ఆరు రోజుల్లో 6 ఎంయూలు పెరిగినవిద్యుత్ వినియోగం → ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ల పేరుతో అనధికారిక కోతలు → గ్రేటర్లో ఎండల ఎఫెక్ట్ శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 35డిగ్రీలు సిటీబ్యూరో: నిన్న మొన్నటి వరకు ఎంతో చల్లగా ఉన్న నగరంలో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం రెట్టింపైంది. గ్రేటర్లో శుక్రవారం 35.0 డిగ్రీల గరిష్ఠ, 22.5 కనిష్ఠ ఉష్ణోగ్రత న మోదైంది. ఇలా రోజూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు విద్యుత్పై ప్రభావం చూపిస్తున్నాయి. ఫిబ్రవరి తొలి వారం వరకు విద్యుత్ డిమాండ్ 34-36 మిలియన్ యూనిట్లు ఉంటే... తాజాగా 42.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఉక్కపోత వల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగంపై ప్రభావం పడుతోంది. ఉన్నట్టుండి విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఫీడర్లపై భారం పడి తరచూ ట్రిప్పవుతున్నాయి. అప్పుడే ముచ్చెమటలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నా యి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటికి అవసరమైన విద్యుత్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం అధికమవుతోంది. దీని వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే ప్రమా దం ఉందని చెబుతూ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ప్రతి రెండు గంటలకోసారి 15-20 నిమిషాల పాటు అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో అనధికారిక విద్యుత్ కోతలకు తెర తీశారు. శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే... మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పగటి ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వివిధ కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ముందస్తు చర్యలు వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేం దుకు విద్యుత్ సిబ్బంది ఇప్పటికే లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ లు తొలగిం చడం.... ఆయిల్ లీకేజీ అవుతున్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి సరిచేయడం...ఇతరత్రా మరమ్మతుల పనుల్లో పనుల్లో నిమగ్నమయ్యారు. సబ్స్టేషన్లలోని ఫీడర్ల వారీగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా ఈ పనులు పూర్తయినట్లు డిస్కం వెల్లడించింది. -
అప్పుడే భగభగ
మండుతున్న ఎండలు 36 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రత హడలిపోతున్న జనం పోచమ్మమైదాన్ : నెల రోజుల ముందుగానే భానుడు భగభగ మంటున్నాడు. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు కొంత చల్లగా ఉంటోంది. ఆ వెంటనే సూర్య భగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధవారం పగటి ఉష్ణోగ్రత 36 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రత 29 సెల్సియస్ డిగ్రీలు మాత్ర మే ఉంది. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది. సహజంగా మార్చి మొదటి వారంలో పెరగాల్సిన ఎండలు.. ఫిబ్రవరి మొదటివారంలోనే మండిపోతుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎండలు ఎలా ఉంటాయోనని అందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులతో ఈ విధమైన పరిస్థితులు వస్తున్నాయని, ఈ ఏడాది వేసవిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.