అంతర పంటలపై రైతుల ఆసక్తి | Farmers interested on inter-crops | Sakshi
Sakshi News home page

అంతర పంటలపై రైతుల ఆసక్తి

Jul 24 2016 5:25 PM | Updated on Jun 4 2019 5:16 PM

అంతర పంటలపై రైతుల ఆసక్తి - Sakshi

అంతర పంటలపై రైతుల ఆసక్తి

మండలంలో రైతులు అంతర పంటలపై ఆసక్తి చుపుతున్నారు. రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండకపోవడంతో ఈ ఏడాది రైతన్నలు అంతర పంటలు అధికంగా సాగు చేశారు.

పెద్దేముల్‌: మండలంలో రైతులు అంతర పంటలపై ఆసక్తి చుపుతున్నారు. రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండకపోవడంతో ఈ ఏడాది రైతన్నలు అంతర పంటలు అధికంగా సాగు చేశారు. మండలంలోని మారేపల్లి, నాగులపల్లి, తట్టెపల్లి, నర్సాపూర్‌, కోటపల్లి, అడ్కిచెర్ల తదితర గ్రామాల రైతులు కందిలో పెసర, మినుములో కంది పంటలు వేసి పంటలు సాగు చేశారు. అంతర పంటలు సాగు చేయటంతో ఓ పంట పాడైనా మరో పంట ఆదుకుంటుందని రైతులు అంటున్నారు. గతేడాది రైతన్నలు అధికంగా పత్తిపంట సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పప్పుదినుసుల పంటలు అధికంగా సాగు చేశారు. సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా కంది, పెసర, మినుము తదితర పప్పుదినుసుల పంటలను సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement