పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి | farm laborer killed by Thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి

Sep 13 2016 10:56 PM | Updated on Sep 4 2017 1:21 PM

పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి

పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి

పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని ఆకునూరులో మంగళవారం జరిగింది.

చేర్యాల : పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని ఆకునూరులో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆకునూరు గ్రామానికి చెందిన తాటికొండ బొందమ్మ(50) వ్యవసాయ కూలీకి వెళ్లి ఇంటికి తిరుగుపయనమైంది. ఈ క్రమంలో ఆమె ఆకునూరులోని గంగమ్మ గుడి సమీపంలోని పెద్దవాగులో నుంచి వస్తుండగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త వెంకటస్వామి, కుమార్తె ఉన్నారు.  ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, మాజీ సర్పంచ్‌ లావణ్యరఘువీర్, పల్లె కనకయ్య, శనిగరం నరేందర్, ఎండీ.హైమత్, మోంటె ఉపేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement