ప్యాసెంజర్ రైల్లు ప్రయాణికులతో ఫుల్
– అవస్థలు పడుతున్న ప్రయాణికులు
– రైల్వేస్టేషన్ను ఉన్నా ఫలితం లేదంటున్న జనం
ముదిగుబ్బ : ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉంది.. కానీ రైలు ఎక్కలేని పరిస్థితి. నియోజకవర్గంలో ముదిగుబ్బ అతిపెద్ద మండలం. దాదాపుగా 60వేల జనాభా ఉంది. ముదిగుబ్బ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణించడానికి నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి మండలాల నుండే కాక పొరుగు జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాలు, జిల్లాలోని బుక్కపట్నం మండలంలోని శివారు ప్రాంత గ్రామాల నుంచి ప్రయాణించడానికి వస్తుంటారు. అయితే ముదిగుబ్బ రైల్వేస్టేషన్ మీదుగా రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ముదిగుబ్బ రైల్వేస్టేషన్లో వేచి ఉంటున్నారు. తీరా రైలు రావడమే ప్రయాణికులతో రద్దీగా వస్తుండటంతో నిలబడటానికి చోటు లేకుండాపోతోంది.
గుంతకల్ ప్యాసెంజర్ రైలుకు కేవలం 9 బోగీలు మాత్రమే ఉండగా వాటిలో రెండు బోగీలు రిజర్వేషన్ సౌకర్యం ఉంటాయి. అవి గుంతకల్ అనంతపురం, ధర్మవరం స్టేషన్లకు రాగానే ప్రయాణికులతో బోగీలన్నీ నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత వరకు ప్రయాణిస్తే అంత వరకు ప్రయాణికులు నిలబడే ప్రయాణించాల్సి వస్తోంది. మరికొంత మంది రైలు డోర్ వద్ద వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ప్యాసింజర్ రైళ్ల పరిస్థితి ఇలా ఉంటే వారానికి 4ఎక్స్ప్రెస్ రైళ్లు ముదిగుబ్బ మీదుగా వెళ్తుంటాయి. అయితే రైల్వేస్టేషన్లో స్టాపింగ్ పాయింట్ లేక పోవడంతో ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంది. కనీసం ఎక్స్ప్రెస్ రైళ్లు పద్మావతి, సెవెన్హిల్స్, అమరావతి రైళ్లనైనా ముదిగుబ్బలో నిలబడేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సర్కస్ ఫీట్లు తప్పడం లేదు
గుంతకల్ ప్యాసింజర్ రైలు ముదిగుబ్బ చేరుకునే సరికి బోగీలన్నీ పూర్తిగా నిండిపోతున్నాయి. 5 బోగీలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండటంతో రైలులో వెళ్లాలంటే సర్కస్ఫీట్లు చేయక తప్పలేదు.
– వెంకటనాయుడు, ముదిగుబ్బ
బోగీల సంఖ్యను పెంచాలి
గుంతకల్ ప్యాసెంజర్ రైలులో బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో ముదిగుబ్బ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు పిల్లలతో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి బోగీల సంఖ్యను పెంచి ప్యాసింజర్ రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలి.
– శివానంద, పొడ్రాళ్లపల్లి
ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లు
Published Sun, Dec 4 2016 11:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement