మాజీ ఎంపీ రివాల్వర్‌ చోరీ | Ex MP kp reddaiah yadav Revolver Missing | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ రెడ్డయ్య రివాల్వర్‌ చోరీ!

Jan 5 2017 8:49 AM | Updated on Sep 5 2017 12:24 AM

మాజీ ఎంపీ రివాల్వర్‌ చోరీ

మాజీ ఎంపీ రివాల్వర్‌ చోరీ

కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ ఎంపీ కేపీ.రెడ్డయ్య యాదవ్‌ రివాల్వర్‌ను దుండగులు చోరీ చేశారు.

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ ఎంపీ కేపీ.రెడ్డయ్య యాదవ్‌ రివాల్వర్‌ను దుండగులు చోరీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనగర్‌కాలనీ సమీపంలో ఉన్న శాలివాహన నగర్‌లో నివసించే కేపి.రెడ్డయ్య యాదవ్‌ గత నెల 5వ తేదీన ఫిలింనగర్‌లో జరిగిన మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ కుమారుడి పెళ్ళికి వెళ్లారు. ఆ కార్యక్రమానికి హాజరై రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈ నెల 2వ తేదీన డిశ్చార్జి అయ్యారు. అదే రోజు రివాల్వర్‌ కోసం గాలించగా కనిపించలేదు. ప్రమాదం జరిగిన రోజున అక్కడే పడిపోయి ఉంటుందా.? లేదా చోరీకి గురైందా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో తన రివాల్వర్‌ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement