ఎన్టీపీసీలో ఇంజినీర్స్‌ డే | engineers day in ntpc | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో ఇంజినీర్స్‌ డే

Sep 16 2016 12:29 AM | Updated on Sep 4 2017 1:37 PM

జ్యోతినగర్‌: దేశాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర కీలకమని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం టీటీఎస్‌ ఉద్యోగ వికాస కేంద్రంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) చాప్టర్‌ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన 49వ ఇంజినీర్స్‌ డే వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు.

జ్యోతినగర్‌: దేశాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర కీలకమని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం టీటీఎస్‌ ఉద్యోగ వికాస కేంద్రంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) చాప్టర్‌ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన 49వ ఇంజినీర్స్‌ డే వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రోజురోజుకూ మారుతున్న ప్రపంచ పరిణామాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇంజనీర్స్‌డే ప్రతిజ్ఞ అనంతరం బ్రోచర్‌ విడుదల చేశారు. ‘యువ ఇంజనీర్ల నైపుణ్యం, పరిశ్రమల్లో సంస్కరణలు’ అంశంపై ఈఎస్‌సీఐ డైరెక్టర్‌ డి.ఎన్‌.రెడ్డి‡Sవిద్యార్థులకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. వ్యాసరచన పోటీలలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించిన కరీంనగర్‌ వాగేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని ఆమనికి బహుమతి అందించారు. అనంతరం సోమారపు సత్యనారాయణను పూలమాల, శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మహాపాత్ర, ఆర్జీ–3 జీఎం డాక్టర్‌. ఎం.ఎస్‌.వెంకట్రామయ్య, రామగుండం జీఎం దాస్‌గుప్తా, చంద్రశేఖర్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement