దోసారావు మృతి పార్టీకి తీరనిలోటు | dosarao dead | Sakshi
Sakshi News home page

దోసారావు మృతి పార్టీకి తీరనిలోటు

Aug 31 2016 10:40 PM | Updated on May 29 2018 4:26 PM

దోసారావు మృతి పార్టీకి తీరనిలోటు - Sakshi

దోసారావు మృతి పార్టీకి తీరనిలోటు

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు నిమ్మకాయల దోసారావు మృతి పార్టీకి తీరని లోటని పార్టీ నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ చెప్పారు. బుధవారం ఇక్కడ దోసారావు చిత్రపటానికి ఎమ్మెల్సీ బోస్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.

  • వైఎస్సార్‌ సీపీ నేత, ఎమ్మెల్సీ బోస్‌ నివాళి
  • సోమేశ్వరం (రాయవరం) :
    వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు నిమ్మకాయల దోసారావు మృతి పార్టీకి తీరని లోటని పార్టీ నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ చెప్పారు. బుధవారం ఇక్కడ దోసారావు చిత్రపటానికి ఎమ్మెల్సీ బోస్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కె.గంగవరం ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, అనపర్తి, పి.గన్నవరం నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, ఎస్‌బీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ల అధినేత సత్తి బులిస్వామిరెడ్డి, ఎంపీటీఈ పేకేటి ఈశ్వరరావు, సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వైట్ల రాంబాబు, పెమ్మనబోయిన నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వంకా సాయికుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోట వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ నేతలు ధూళిపూడి వెంకటేశ్వరరావు, గిరజాల వెంకటేశ్వరరావు, గరగ కామరాజు, జరజాపు లక్ష్మణస్వామి, గరగ బాలయోగి, బీజేపీ నేత నిమ్మకాయల సాయిరామ్‌ప్రసాద్, కాపు సంఘం మండల అధ్యక్షుడు నున్న వెంకటరమణ నివాళులర్పించారు. సోమేశ్వరం పంచాయతీలో సర్పంచ్‌ యండమూరి రాజ్యలక్ష్మి పరమహంస అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement