నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
యాదాద్రి: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులు రద్దీ దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలు అనుమతించ లేదు. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.