పరీక్ష రాయడానికి వెళ్తూ అనంతలోకాలకు.. | Degree student dies in Road accident | Sakshi
Sakshi News home page

పరీక్ష రాయడానికి వెళ్తూ అనంతలోకాలకు..

Mar 31 2016 3:14 PM | Updated on Aug 30 2018 4:07 PM

భార్య డిగ్రీ పరీక్షలు రాస్తుండటంతో.. ఆమెను పరీక్ష కేంద్రం వద్ద దించడానికి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది.

వికారాబాద్ (రంగారెడ్డి) : భార్య డిగ్రీ పరీక్షలు రాస్తుండటంతో.. ఆమెను పరీక్ష కేంద్రం వద్ద దించడానికి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఫ్లై ఓవర్‌పై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

స్థానిక సాకేత్‌నగర్‌లో నివాసముంటున్న చందు పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. ఆయన భార్య మేరి(25) వికారాబాద్‌లోని ఎస్‌ఐపీ కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాస్తోంది. దీంతో ఆమెను పరీక్షా కేంద్రం వద్దకు తీసుకెళ్లేందుకు  ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేరి అక్కడికక్కడే మృతిచెందగా.. చందుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement