చిత్తూరు జిల్లా కుప్పం శివారులోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహన్ని మంగళవారం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం శివారులోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహన్ని మంగళవారం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కుప్పం మండలం ఎర్రమానిగుంత గ్రామానికి చెందిన చిన్న కన్ను (50) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వ్యక్తిగత కక్షలు ఏమైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.