గద్వాల : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సం స్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుభా న్ అన్నారు. గురువారం అధిక ఫీజులను నిరసిస్తూ స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఫీజులు నియంత్రించాలి
Jul 22 2016 1:05 AM | Updated on Jul 26 2019 4:10 PM
గద్వాల : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సం స్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుభా న్ అన్నారు. గురువారం అధిక ఫీజులను నిరసిస్తూ స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం వారిపట్ల ఉ దాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించా రు. ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అం జి, నాగరాజు, రాకేష్, రవి, గోపాల్, రాజు, రాము, ఆనం ద్, తాయన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement