వనజాక్షి ఘటనే కాదు.. ఇంకా అలంటావి ఎన్నో | chandrababu trying to save mla chinthamaneni | Sakshi
Sakshi News home page

వనజాక్షి ఘటనే కాదు.. ఇంకా అలంటావి ఎన్నో

Jul 12 2015 6:06 PM | Updated on Sep 3 2017 5:23 AM

వనజాక్షి ఘటనే కాదు.. ఇంకా అలంటావి ఎన్నో

వనజాక్షి ఘటనే కాదు.. ఇంకా అలంటావి ఎన్నో

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వ నేతలు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.

ఏపీలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ కూడా సర్కార్ హత్యలేనని ఆరోపించారు. తహశీల్దార్ వనజాక్షి ఘటన ఒక్కటే వెలుగులోకి వచ్చిందని, ఇంకా వెలుగులోకి రానీ ఎన్నో సంఘటనలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కాపాడేందుకు సీఎం పదవిని దుర్వినియోగం చేస్తున్నారని రఘువీరా విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement