'ఆంధ్రా ఎంపీలు.. పీఎం ఇంటి ముందు ధర్నా చేయండి' | Sakshi
Sakshi News home page

'ఆంధ్రా ఎంపీలు.. పీఎం ఇంటి ముందు ధర్నా చేయండి'

Published Fri, May 20 2016 6:04 PM

chalasani srinivas takes AP MPS

ఏలూరు: ఆంధ్రా ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.... విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేలా అఖిలపక్ష కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధక కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న గుంటూరులో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement
Advertisement