మనోధైర్యమే మహాబలం | canser day rally actor kajal | Sakshi
Sakshi News home page

మనోధైర్యమే మహాబలం

Feb 4 2017 11:33 PM | Updated on Aug 17 2018 2:34 PM

మనోధైర్యమే మహాబలం - Sakshi

మనోధైర్యమే మహాబలం

కేన్సర్‌ బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపేందుకు యువత ముందుకు రావాలని, ఏ రోగాన్ని జయించడానికైనా ముందుగా కావల్సింది ఆత్మస్థైర్యమని సినీనటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు అవగాహన ర్యాలీలు, సదస్సుల ద్వారా పల్లె ప్రాంతాల్లో

  • ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా అవగాహన ర్యాలీ
  • కాకినాడ/సామర్లకోట : 
    కేన్సర్‌ బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపేందుకు యువత ముందుకు రావాలని, ఏ రోగాన్ని జయించడానికైనా ముందుగా కావల్సింది ఆత్మస్థైర్యమని సినీనటి కాజల్‌ అగర్వాల్‌  అన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు అవగాహన ర్యాలీలు, సదస్సుల ద్వారా పల్లె ప్రాంతాల్లో ప్రజలను చైతన్య పరిచేందుకు యువత ముందుకు  రావాలని పిలుపునిచ్చారు. శనివారం ఉదయం  కాకినాడ సమీపంలోని సూర్య గ్లోబల్‌ ఆసుపత్రి ఆ««దl్వర్యంలో ప్రపంచ కేన్సర్‌ దినోత్సవ సందర్భంగా కాకినాడ భానుగుడి జంక్ష¯ŒS నుంచి నిర్వహించిన క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ (2 కె ర¯ŒS), ఎగ్జిబిష¯ŒS గ్రౌండ్‌లో జరిగిన కేన్సర్‌ అవగాహన సదస్సు కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆసుపత్రి చైర్మ¯ŒS డాక్టర్‌ బీహెచ్‌పీఎస్‌ వీర్రాజు మాట్లాడుతూ కేన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకునేలా అధునాతన చికిత్స తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి కేన్సర్‌ కేసులను 25 శాతానికి తగ్గించేలా లక్ష్యాన్ని నిర్ధారించినట్లు వివరించారు. కేన్సర్‌ అవగాహనపై ప్రత్యేక బ్రోచర్‌ను సదస్సులో ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు మాట్లాడుతూ కేన్సర్‌ నివారణ కోసం ఉద్యమంలా సమైక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేన్సర్‌ రోగులకు పండ్లను కాజల్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వై.ప్రశాంత్, కె.ప్రశాంత్, డాక్టర్‌ రాజేంద్ర, రాజా తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement