బంద్ సంపూర్ణం
ప్రత్యేక హోదా డిమాండ్తో మంగళవారం నిర్వహించిన బంద్ నియోజకవర్గవ్యాప్తంగా విజయవంతమైంది. పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీఐటీయూ, ఐద్వా, పట్టణ పౌరసంక్షేమ సంఘం, అఖిల భారత రైతుకూలీ సంఘం, వర్తక కళాసీ సంఘం, 20వవార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు యూత్ ఆధ్వర్యంలో బంద్ చేస్తుండగా పోలీసులు విరుచుకు పడ్డారు.
వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు
పార్వతీపురంలో 63 మంది అరెస్ట్
పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట రూరల్: ప్రత్యేక హోదా డిమాండ్తో మంగళవారం నిర్వహించిన బంద్ నియోజకవర్గవ్యాప్తంగా విజయవంతమైంది. పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీఐటీయూ, ఐద్వా, పట్టణ పౌరసంక్షేమ సంఘం, అఖిల భారత రైతుకూలీ సంఘం, వర్తక కళాసీ సంఘం, 20వవార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు యూత్ ఆధ్వర్యంలో బంద్ చేస్తుండగా పోలీసులు విరుచుకు పడ్డారు. ఆందోళనకారులను లాక్కెళ్లి వాహనాల్లో పట్టణ, రూరల్ పోలీసు స్టేషన్లకు తరలించి అరెస్టు చేశారు. డిపోలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హోటళ్లు, సినిమాహాళ్లు, దుకాణాలను మూసివేశారు.
]
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం
మాయల మరాఠీ చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పట్టిన అరిష్టమని వైఎస్సార్ సీపీ పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధనలో కాకుండా మంగళవారం చేపట్టిన బంద్ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మెయిన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, చుక్క లక్ష్ముంనాయుడు, రౌతు సత్యంనాయుడు, రణబేరి బంగారు నాయుడు, వెంపల గురురాజు, కౌన్సిలర్లు మంత్రి రవి, ఎస్. శ్రీనివాసరావు, గొల్లు వెంకట్రావు, ఒ.రామారావు, చీకటి సూర్యనారాయణ, బోను ఆదినారాయణ, సాయిరాం, దామోదర్, జొన్నాడ శ్రీదేవి, బూతాల వెంకటరమణ, గండి లక్ష్మి, రాజారావు, శ్రీరాముల నాయుడు, సర్పంచ్లు బొమ్మి రమేష్, రమణ మూర్తి, రొంపిల్లి తిరుపతిరావు, యాండ్రాపు తిరుపతిరావు, ఎంపీటీసీలు సీదారపు ఎర్రప్ప, గణేష్, గండి శంకరరావు, రామారావు, సిగడం భాస్కరరావు, సీదరపు సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ సీఐ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వి.అశోక్కుమార్, బి.సురేంద్రనాయుడు, సన్యాసినాయుడు వాహనాల్లో పడేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో వంటావార్పు
20వ వార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 150 మంది వరకు యువకులు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద టెంట్లు వేసి వంటా వార్పు చేపట్టారు. సీపీఎం నేత రెడ్డి శ్రీరామ్మూర్తి, సీఐటీయూ నాయకులు జీవీ సన్యాసి, ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి, పట్టణ పౌర ‡సంక్షేమ సంఘ నేత పాకల సన్యాసి తదితరులు మెయిన్ రోడ్డులో దుకాణాలను మూయించి ఆర్టీసీ బస్సులు, వాహనాలను అడ్డుకున్నారు. అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు మేస్త్రి పూర్ణచంద్రరావు, మల్లిక్, వి.కష్ణ, పట్టణ వర్తక కళాసీ సంఘం నాయకులు జి.సర్వేశ్వరరావు, ఎస్.రమణ, రాగోలు సర్వేశ్వరరావు పాతబస్టాండ్, రాయగడ రోడ్డు, మెయిన్ రోడ్లలో పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన దాదాపు 63మందిని పోలీసులు అరెస్టు చేసి సాయంత్రానికి విడిచి పెట్టారు.
సీతానగరం మండలంలో విజయవంతం
ప్రత్యేక హోదా డిమాండ్తో వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు నిర్వహించిన బంద్ సీతానగరం మండలంలో విజయవంతమైంది. వ్యాపార సంస్థలు, బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలను మూసివేసారు. వైఎస్ఆర్సీపీ మండల నాయకులు జి.లక్ష్మణరావు, బి.సూర్యనారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిలక్షున్నాయుడు, డివిజన్ కార్యదర్శి ఆర్.ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కల్పిస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ ప్రకటించి మాట తప్పారన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయుకులు పోలీశ్వరనాయణ, తోడబండి సూర్యనారాయణ, గొట్టాపు వెంకటనాయుడు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జీవీ రమణ, ఆర్.రాము పాల్గొన్నారు.
హోదా ఇవ్వాల్సిందే
విభజనతో ఆర్థిక, సామాజిక, ఉద్యోగ పరంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎన్సీఎస్ శ్రీరామా సుగర్మిల్ లేబర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేసారు. కర్మాగారం ఎదుట రాష్ట్రరహదారిపై యూనియన్ కార్యదర్శి చెలికాని గోపాలకష్ణ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్.కొండలరావు, ఎస్.సన్యాసిరాజు, ఎల్వీ రమణ, అల్లు తిరుపతి రావు, వై.సత్యనారాయణ పాల్గొన్నారు. ఎస్ఐ బి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచే చినబోగిలి, లచ్చయ్యపేట, రైల్వేస్టేషన్, మర్కెట్, ప్రధానకూడళ్ళలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ ఎస్.గోవిందరావు మాట్లాడుతూ బొబ్బిలి సర్కిల్ పరిధిలోని 5 మండలాల్లో బంద్ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, బాడంగిలో కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
బలిజిపేటలో సంపూర్ణం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్సీపీ మంగళవారం నిర్వహించిన బంద్ బలిజిపేట మండలంలో విజయవంతమైంది. బలిజిపేటలో దుకాణాలను తెరవలేదు. ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూతపడ్డాయి. వైఎస్ఆర్ సీపీ నాయకులు పి.మురళీకష్ణ, నారాయణపురం సర్పంచ్ ఎం.ప్రసాదరావు, ఎంపీటీసీ ఎం.శ్రీరామ్మూర్తి, కె.వెంకటరమణ, గౌరునాయుడు, బి.తమ్మినాయుడు, మహేష్, జి.పోలిరాజు, జి.రామినాయుడు, ఎస్.రమేష్, పి.చంటి, జి.ఉమామహేశ్వరరావు, పి.రాము, ఎస్.ప్రసాద్ రహదారిని దిగ్బంధించి వాహనాల రాకపోకలను సుమారు గంటపాటు నిలిపివేశారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను పోలీస్స్టేషనుకు తరలించి కేసులు నమోదుచేశారు. వామపక్షాల నేతలు వంజరాపు సత్యంనాయుడు, యమ్మల మన్మధరావు, హమాలీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.