Parvatipuram constituency
-
టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై కేసు.. ఈ సారి ఏం చేశారంటే?
సాక్షి,పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై మరో మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించారంటూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్ కాల్లో అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్మెయిల్కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్ కాల్ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలుడ మండిపడ్డాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మరో మహిళ టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఫిర్యాదు చేయడం గమనార్హం. -
అన్న వస్తున్నాడు...
అభిమాన నేత వస్తున్నారు. ప్రజాసంకల్పంతో ఈ ప్రాంత ప్రజలతో మమేకమై... ప్రతి బాధితుడి గోడు విని... అందరికీ భరోసా కల్పించి... అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్న జగనన్న కొద్ది రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలిసిన జనం ఉప్పొంగిపోయారు. ఆయనతో వేసిన అడుగులను ఇప్పటికీ పదిలంగా మదిలో దాచుకున్నారు. మళ్లీ వస్తున్న రాజన్న బిడ్డను చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముందస్తు ప్రచారం జరగడంతో ఆయన సభకు తరలి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో తనతో కలిసి అడుగులు వేసిన పార్వతీపురం ప్రజల కోసం, టీడీపీ హయాంలో పడ్డ కష్టాల నుంచి బయటపడేసేందుకు... నేనున్నానంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం పార్వతీపురం వస్తున్నారు. హెలికాఫ్టర్లో ఉదయం 9.30 గంటలకు పట్టణానికి చేరుకుని మెయిన్రోడ్ మీదుగా రోడ్షో చేసుకుంటూ పాతబస్టాండ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం వెల్లడించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు సిద్ధం ఎన్నికల ప్రచారానికి జగన్ వస్తుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ను సభాస్థలికి దగ్గర్లోనే ఏర్పాటు చేసుకున్నారు. పార్టీపై ఇష్టంతో, జగన్పై నమ్మకంతో వైఎస్సార్సీపీలో చేరాలనుకుంటున్న నేతలు ఆయనకోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రజలు మరోసారి జగన్కు నీరాజనాలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నేళ్లుగా టీడీపీ పాలనలో కనీసం తాగునీటికి కూడా నోచుకోలేక, బురద నీటితో కాలం వెళ్లదీస్తున్న తమ బతుకులు మారాలంటే జగన్ సీఎం కావాలనే నిర్ణయానికి వారు ఇప్పటికే వచ్చారు. తోటపల్లి ఆయన తండ్రి చలవే 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర పాలనా అనుమతులను తీసుకొని జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టులో 2.5 టీఎంసీల నీటిని నిల్వచేసి పాత ఆయకట్టు 64వేల ఎకరాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మరో లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పించారు. రూ. 450.23 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో పనులను పూర్తి చేయాలని నిర్ణయించి భూ సేకరణ, స్పిల్వే, కుడి ప్రధాన కాలువ, హెడ్స్లూయీస్ తదితర 90శాతం పనులను పూర్తిచేశారు. నిర్వాసితుల సమస్య కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ. 772 కోట్లకు పెరిగితే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రూ. 600 కోట్లు మంజూరు చేశారు. బాబువన్నీ డాంబికాలు టీడీపీ ప్రభుత్వం కేవలం రూ. 65 కోట్లు విడుదల చేసి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటోంది. నేటికీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేకపోయింది. నందివానివలస, సుంకి, పిన్నింటి రామినాయుడువలస, బాసంగి, బాసంగి, గదబవలస, దుగ్గి, బిత్రపాడు, పాతకళ్లికోట, గుణానుపురం తదితర గ్రామాలకు ఇంతవరకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదు. వృద్ధులకు, వికలాంగులకు ప్యాకేజీ కూడా పూర్తిస్థాయిలో అందించలేదు. సుమారు 200 ఎకరాలు భూ సేకరణ చేయాల్సివుండగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేకపోవడంతో 117 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ పరిధిలో పిల్ల కాలువలు ఏర్పాటు కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో సాగునీరు అందట్లేదు. 2015లో 50వేల ఎకరాలకు, 2016లో 89వేల ఎకరాలకు, 2017లో లక్షా 7వేల ఎకరాలకు, 2018లో లక్షా 10వేలు ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఇరిగేషన్ అధికారులు, పాలకులు ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవానికి 50వేల ఎకరాలకు మించి సాగునీరు సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. చెరకు రైతుల బకాయిలేవీ... లచ్చయ్యపేట వద్ద 2002లో ఎన్ఎస్ఎఫ్ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలో ప్రారంభించారు. 2004లో చంద్రబాబు హయాంలో దానిని ఎన్సీఎస్ యాజమాన్యానికి రూ.21కోట్లకు విక్రయించారు. నిజానికి కర్మాగారం అసలు విలువ రూ.76కోట్లే. దాదాపు 13వేల మంది రైతులు 15 మండలాల నుంచి చెరుకును కర్మాగారానికి ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పంటకు గిట్టుబాటు లేక నాలుగు లక్షల టన్నుల నుంచి రెండు లక్షల టన్నులకు పంట సాగు పడిపోయింది. 2016–12కి రైతులకు యాజమాన్యం రూ.2కోట్లు బకాయిలు చెల్లించాలి. 2017–18కి రూ.8 కోట్లు చెల్లించాలి. ఈ ఏడాది కూడా రైతు పంట అందించినప్పటికి రెండు నెలలు అవుతున్నా బిల్లులు చెల్లించలేదు. అయినా ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఇలాంటి దీర్ఘకాలిక, భారీ సమస్యలన్నీ జగన్ సీఎం అయితే పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశపడుతున్నారు. జంఝావతి సమస్య తీరలేదు జంఝావతి ప్రాజెక్టును 1100 ఎకరాల భూమిని సేకరించి 1976లో నిర్మించారు. ఇంకా 1175 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రూ.5కోట్లతో వైఎస్ 2006లో రబ్బర్ డ్యాం నిర్మించారు. ఎత్తిపోతల పోతల పథకం ద్వారా 800 ఎకరాలకు సాగునీరు అందించారు. పది ముంపు గ్రామాలుండగా వాటిని తొలగించడానికి ఒడిశా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ సమస్యను ఇంతవరకూ టీడీపీ పట్టించుకున్న పాపాన పోలేదు. -
విలక్షణతకు మారుపేరు పార్వతీపురం
సాక్షి, పార్వతీపురం: ఏజెన్సీ ముఖ ద్వారంగా ఉన్న పార్వతీపురం నియోజకవర్గానికి ఆది నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ఓటర్ల నాడి పట్టుకోవడం తలలు పండిన రాజకీయవేత్తలకు సైతం చిక్కలేదు. నియోజవర్గం ఏర్పాటు నుంచి నేటి వరకు ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు. గతంలో పార్వతీపురం నియోజకవర్గం జనరల్గా ఉండేది. ప్రస్తుతం 2014 నుంచి ఎస్సీ రిజర్వేషన్గా కొనసాగుతోంది. అప్పట్లో కురుపాం రాజుల పాత్ర రాజకీయాల్లో ఎక్కువగా ఉండేది. ప్రతి ఎన్నికల్లో వారు కీలక పాత్ర పోషించేవారు. రాజులు ఎవరికి మద్దతు తెలిపితే ఆ వైపు విజయవకాశాలు ఉంటాయన్న భావన ఉండేది. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన రెండు ఉప ఎన్నికలతో పాటు 16 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తండ్రి దుర్గాప్రసాద్ దేవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 8 పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా... టీడీపీ అభ్యర్థులు ఐదు సార్లు విజయం సాధించారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున మరిశర్ల వెంకటరామినాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరలా 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున చీకటి పరశురాం నాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే పార్వతీపురం నియోజకవర్గంలో ఆ నాటి నుంచి నేటి వరకు కురుపాం కురుపాం రాజుల ప్రాబల్యం కొనసాగుతోంది. పార్వతీపురం నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నప్పటికీ రాజుల రాజకీయ ముద్ర నేటికీ కొనసాగుతూనే ఉంది. 1972లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన చీకటి పరశురాంనాయుడుకు 1978లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడిపై విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మరిశర్ల వెంకటరామినాయుడు టీడీపీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డి పరశురాంపై విజయం సాధించారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కూడా మళ్లీ వీరిద్దరూ తలపడగా వెంకటరామినాయుడినే విజయం వరించింది. 1989లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేసిన యర్రా కృష్ణమూర్తి, కాంగ్రెస్ అభ్యర్థి మరిశర్ల శివున్నాయుడిపై విజయం సాధించారు. 1994లో కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరగ్గా యర్రా కృష్ణమూర్తే గెలుపొందారు. 1997లో యర్రా కృష్ణమూర్తి శ్రీకాకుళం ఎన్నికల ప్రచారానికి వెళ్లి మృత్యువాత పడడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కృష్ణమూర్తి భార్యర యర్రా అన్నపూర్ణమ్మ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మరిశర్ల శివున్నాయుడిపై విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వరుసుగా మూడుసార్లు ఓడిపోయిన మరిశర్ల శివున్నాయుడు (కాంగ్రెస్) టీడీపీ అభ్యర్థి ప్రతిమాదేవిపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటినుంచి 2014 వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కొనసాగుతూ వచ్చింది. 2004లో జరిగిన ఎన్నికల్లో కురుపాంనకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి జనరల్ కోటాలో పోటీచేశారు. ఈయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ద్వారపురెడ్డి జగదీష్ పోటీచేసి పరాజయం పొందారు. అనంతరం విజయరామరాజు వైఎస్ క్యాబినెట్లో అటవీశాఖామంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సవరపు జయమణి తెలుగుదేశం అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై విజయం సాధించారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అలజంగి జోగారావు, తెలుగుదేశం తరఫున బొబ్బిలి చిరంజీవులు, వైఎస్సార్సీపీ నుంచి జమ్మాన ప్రసన్నకుమార్ పోటీ చేయగా బొబ్బిలి చిరంజీవులు విజయం సాధించారు. కొప్పల వెలమలే నిర్ణేతలు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు ఓటమిలను నిర్ణయించేది ప్రధాన సామాజిక వర్గమైన కొప్పలవెలమలే. ప్రతి ఎన్నికలోనూ కొప్పల వెలమ సామాజిక వర్గం ఏ పార్టీవైపు పనిచేస్తే ఆ పార్టీ తప్పక గెలుస్తుంది. కొప్పలవెలమ సామాజికవర్గం మూడు మండలాలతో పాటు పార్వతీపురం మున్సిపాల్టీలో కూడా బలంగా ఉంది. అయితే 2014లో పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో మాల, మాదిగ సామాజికవర్గ ఓటర్లకు ప్రాధాన్యం దక్కింది. ఎన్నికల్లో కొప్పల వెలమ తర్వాత మాదిగ సామాజికవర్గ ఓటర్లే కీలకం. పార్వతీపురం నియోజకవర్గంలో ఓటర్లు మొత్తం ఓటర్లు 1,75,625 పురుషులు 87,120 మహిళలు 88,493 ఇతరులు 12 ఎమ్మెల్యేల వివరాలు.. 1952లో పార్వతీపురం నియోజకవర్గం ఏర్పాటు 1952–57 : దుర్గాప్రసాద్ దేవ్ (కాంగ్రెస్) 1957–62 : చంద్రచూఢామణి దేవ్ (కాంగ్రెస్) 1962–67 : చంద్ర చూఢామణిదేవ్ (కాంగ్రెస్) 1967–72 : మరిశర్ల వెంకటరామినాయుడు (స్వతంత్ర) 1972–77 : చీకటి పరశురాం నాయుడు (కాంగ్రెస్) 1978–83 : చీకటి పరశురాం నాయుడు (జనతా) 1984 : మరిశర్ల వెంకటరామినాయడు (టీడీపీ) 1985 : మరిశర్ల వెంకటరామినాయుడు (టీడీపీ) 1989–94 : యర్రా కృష్ణమూర్తి (టీడీపీ) 1994–97 : యర్రా కృష్ణమూర్తి (టీడీపీ) 1997–99: యర్రా అన్నపూర్ణమ్మ (టీడీపీ) 1999–2004 : మరిశర్ల శివున్నాయుడు(కాంగ్రెస్) 2004–2009 : శత్రుచర్ల విజయరామరాజు (కాంగ్రెస్) 2009–2014 : సవరపు జయమణి (కాంగ్రెస్) 2014–2019: బొబ్బిలి చిరంజీవులు (టీడీపీ) -
బంద్ సంపూర్ణం
వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు పార్వతీపురంలో 63 మంది అరెస్ట్ పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట రూరల్: ప్రత్యేక హోదా డిమాండ్తో మంగళవారం నిర్వహించిన బంద్ నియోజకవర్గవ్యాప్తంగా విజయవంతమైంది. పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీఐటీయూ, ఐద్వా, పట్టణ పౌరసంక్షేమ సంఘం, అఖిల భారత రైతుకూలీ సంఘం, వర్తక కళాసీ సంఘం, 20వవార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు యూత్ ఆధ్వర్యంలో బంద్ చేస్తుండగా పోలీసులు విరుచుకు పడ్డారు. ఆందోళనకారులను లాక్కెళ్లి వాహనాల్లో పట్టణ, రూరల్ పోలీసు స్టేషన్లకు తరలించి అరెస్టు చేశారు. డిపోలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హోటళ్లు, సినిమాహాళ్లు, దుకాణాలను మూసివేశారు. ] చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం మాయల మరాఠీ చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పట్టిన అరిష్టమని వైఎస్సార్ సీపీ పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధనలో కాకుండా మంగళవారం చేపట్టిన బంద్ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మెయిన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, చుక్క లక్ష్ముంనాయుడు, రౌతు సత్యంనాయుడు, రణబేరి బంగారు నాయుడు, వెంపల గురురాజు, కౌన్సిలర్లు మంత్రి రవి, ఎస్. శ్రీనివాసరావు, గొల్లు వెంకట్రావు, ఒ.రామారావు, చీకటి సూర్యనారాయణ, బోను ఆదినారాయణ, సాయిరాం, దామోదర్, జొన్నాడ శ్రీదేవి, బూతాల వెంకటరమణ, గండి లక్ష్మి, రాజారావు, శ్రీరాముల నాయుడు, సర్పంచ్లు బొమ్మి రమేష్, రమణ మూర్తి, రొంపిల్లి తిరుపతిరావు, యాండ్రాపు తిరుపతిరావు, ఎంపీటీసీలు సీదారపు ఎర్రప్ప, గణేష్, గండి శంకరరావు, రామారావు, సిగడం భాస్కరరావు, సీదరపు సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ సీఐ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వి.అశోక్కుమార్, బి.సురేంద్రనాయుడు, సన్యాసినాయుడు వాహనాల్లో పడేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో వంటావార్పు 20వ వార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 150 మంది వరకు యువకులు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద టెంట్లు వేసి వంటా వార్పు చేపట్టారు. సీపీఎం నేత రెడ్డి శ్రీరామ్మూర్తి, సీఐటీయూ నాయకులు జీవీ సన్యాసి, ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి, పట్టణ పౌర ‡సంక్షేమ సంఘ నేత పాకల సన్యాసి తదితరులు మెయిన్ రోడ్డులో దుకాణాలను మూయించి ఆర్టీసీ బస్సులు, వాహనాలను అడ్డుకున్నారు. అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు మేస్త్రి పూర్ణచంద్రరావు, మల్లిక్, వి.కష్ణ, పట్టణ వర్తక కళాసీ సంఘం నాయకులు జి.సర్వేశ్వరరావు, ఎస్.రమణ, రాగోలు సర్వేశ్వరరావు పాతబస్టాండ్, రాయగడ రోడ్డు, మెయిన్ రోడ్లలో పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన దాదాపు 63మందిని పోలీసులు అరెస్టు చేసి సాయంత్రానికి విడిచి పెట్టారు. సీతానగరం మండలంలో విజయవంతం ప్రత్యేక హోదా డిమాండ్తో వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు నిర్వహించిన బంద్ సీతానగరం మండలంలో విజయవంతమైంది. వ్యాపార సంస్థలు, బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలను మూసివేసారు. వైఎస్ఆర్సీపీ మండల నాయకులు జి.లక్ష్మణరావు, బి.సూర్యనారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిలక్షున్నాయుడు, డివిజన్ కార్యదర్శి ఆర్.ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కల్పిస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ ప్రకటించి మాట తప్పారన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయుకులు పోలీశ్వరనాయణ, తోడబండి సూర్యనారాయణ, గొట్టాపు వెంకటనాయుడు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జీవీ రమణ, ఆర్.రాము పాల్గొన్నారు. హోదా ఇవ్వాల్సిందే విభజనతో ఆర్థిక, సామాజిక, ఉద్యోగ పరంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎన్సీఎస్ శ్రీరామా సుగర్మిల్ లేబర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేసారు. కర్మాగారం ఎదుట రాష్ట్రరహదారిపై యూనియన్ కార్యదర్శి చెలికాని గోపాలకష్ణ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్.కొండలరావు, ఎస్.సన్యాసిరాజు, ఎల్వీ రమణ, అల్లు తిరుపతి రావు, వై.సత్యనారాయణ పాల్గొన్నారు. ఎస్ఐ బి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచే చినబోగిలి, లచ్చయ్యపేట, రైల్వేస్టేషన్, మర్కెట్, ప్రధానకూడళ్ళలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ ఎస్.గోవిందరావు మాట్లాడుతూ బొబ్బిలి సర్కిల్ పరిధిలోని 5 మండలాల్లో బంద్ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, బాడంగిలో కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బలిజిపేటలో సంపూర్ణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్సీపీ మంగళవారం నిర్వహించిన బంద్ బలిజిపేట మండలంలో విజయవంతమైంది. బలిజిపేటలో దుకాణాలను తెరవలేదు. ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూతపడ్డాయి. వైఎస్ఆర్ సీపీ నాయకులు పి.మురళీకష్ణ, నారాయణపురం సర్పంచ్ ఎం.ప్రసాదరావు, ఎంపీటీసీ ఎం.శ్రీరామ్మూర్తి, కె.వెంకటరమణ, గౌరునాయుడు, బి.తమ్మినాయుడు, మహేష్, జి.పోలిరాజు, జి.రామినాయుడు, ఎస్.రమేష్, పి.చంటి, జి.ఉమామహేశ్వరరావు, పి.రాము, ఎస్.ప్రసాద్ రహదారిని దిగ్బంధించి వాహనాల రాకపోకలను సుమారు గంటపాటు నిలిపివేశారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను పోలీస్స్టేషనుకు తరలించి కేసులు నమోదుచేశారు. వామపక్షాల నేతలు వంజరాపు సత్యంనాయుడు, యమ్మల మన్మధరావు, హమాలీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.