బాలుడి మృతదేహం కలకలం | boy dead body create sensation | Sakshi
Sakshi News home page

బాలుడి మృతదేహం కలకలం

Mar 19 2017 10:30 PM | Updated on Jul 12 2019 3:02 PM

బాలుడి మృతదేహం కలకలం - Sakshi

బాలుడి మృతదేహం కలకలం

నంద్యాల పట్టణంలో రెండేళ్ల బాలుడి మృతదేహం కలకలం రేపింది.

నంద్యాల: నంద్యాల పట్టణంలో రెండేళ్ల బాలుడి మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లలో పడేయడంతో పలు అనుమానాలకు తావ్విస్తోంది. బాలాజీ కాంప్లెక్స్‌లోని మారుతి టౌన్‌షిప్‌ వద్ద ఆదివారం ముళ్ల పొదల్లో స్థానికులు బాలుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి మృతదేహాన్ని శనివారం రాత్రి కంపచెట్లలో విసిరేసినట్లు తెలుస్తోంది. బాలుడి కాళ్లు, తొడలు భాగాలను పందులు పీక్కుతిన్నాయి. సీఐ ప్రతాపరెడ్డి, ఎస్‌ఐ నవీన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ పసివాడు సంఘటనా స్థలాన్ని చుట్టు పక్కల ఉన్న ఫరూక్‌నగర్, బాలాజీ కాంప్లెక్స్‌ ప్రాంతాలకు చెందిన వాడు కాదని విచారణలో తేలిందన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement