కుందూలో భూమాకు పిండ ప్రదానం | bhuma pinda pradanam at kundu | Sakshi
Sakshi News home page

కుందూలో భూమాకు పిండ ప్రదానం

Mar 30 2017 10:42 PM | Updated on Sep 5 2017 7:30 AM

కుందూలో భూమాకు పిండ ప్రదానం

కుందూలో భూమాకు పిండ ప్రదానం

దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పెద్దకర్మ సందర్భంగా కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి గురువారం ఉయ్యాలవాడ సమీప కుందూనదిలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తండ్రికి పిండ ప్రదానం చేశారు.

ఉయ్యాలవాడ : దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పెద్దకర్మ సందర్భంగా కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి గురువారం ఉయ్యాలవాడ సమీప కుందూనదిలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తండ్రికి పిండ ప్రదానం చేశారు. ఆళ్లగడ్డ పట్టణ పరిసర ప్రాంతాల్లోని నదులు, వాగుల్లో నీటి పారకం లేకపోవడంతో ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి ఉయ్యాలవాడ, రూపనగుడి మధ్య కుందూనదిలో పిండప్రదానం చేశారు.  భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కిశోర్‌రెడ్డి, భూమా మహేష్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డితో పాటు స్థానిక నాయకులు బుడ్డా రామిరెడ్డి, కూడాల నారాయణరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement