25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌ఐ | bheemili MRO caught red handed by ACB officers | Sakshi
Sakshi News home page

25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌ఐ

Jan 2 2017 7:58 PM | Updated on Aug 17 2018 12:56 PM

భీమిలి ఎమ్మార్వో ఆఫీసులో ఓ రైతు నుంచి రూ.25 వేలు తీసుకుంటూ ఆర్‌ఐ పట్టుబడ్డాడు.

భీమిలి: విశాఖ జిల్లా భీమిలి ఎమ్మార్వో ఆఫీసులో ఓ రైతు నుంచి రూ.25 వేలు తీసుకుంటూ ఆర్‌ఐ పట్టుబడ్డాడు. ఓ రైతు తన వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చడానికి రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నాడు. దీనిని నివాస ప్రాంతంగా మార్చాలంటే రూ.25 వేలు చెల్లించాలని ఆర్‌ఐ జి. శ్రీనివాసరావు సదరు రైతును డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రైతు ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. రైతు నుంచి ఆర్‌ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement